హైదరాబాద్ నగరాన్ని మొత్తం భారీ వర్షం ముంచెత్తుతున్న  విషయం తెలిసిందే. చిన్నపాటి వర్షానికే చిగురుటాకులా వణికిపోయిన హైదరాబాద్ నగరం మొన్న కురిసిన భారీ వర్షానికి పూర్తిగా అతలాకుతలం అయిపోయింది విషయం తెలిసిందే. వరద నీటిలో పూర్తిగా నగరం మొత్తం వరదల్లో మునిగి తేలింది. నగరంలో ఎటు చూసినా పూర్తిగా వరద నీటితో పెద్ద పెద్ద చెరువులు ఉన్నట్లుగా అన్ని ప్రాంతాలు మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు సాధారణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరడంతో పూర్తిగా అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. జనావాసాల్లోకి నీరు రావడంతో జనజీవనం స్తంభించిపోయింది.



 ఎక్కడికక్కడ డ్రైనేజీ నాళాలు  కూరుకుపోయి... వరద నీరు మురికి నీరు మొత్తం ఇళ్లలోకి చేరడంతో ఆ వాసన తట్టుకోలేక నరకం అనుభవించారూ  నగర వాసులు అందరూ. ఇలా పూర్తిగా నగరం మొత్తం జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయింది. భారీ వర్షం పడి రెండు రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ నగరం మొత్తం భారీ వరదల నుంచి తేరుకోలేక పోయింది. ఇప్పటికే అధికారులు ముమ్మర సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇప్పటికే పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు ఎన్నో ఇళ్ళు  కూడా జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి.



 అయితే ఇటీవలే  కురిసిన భారీ వర్షానికి ఏకంగా ఎన్నో భవనాలు కూడా కూలిపోయిన విషయం తెలిసిందే. ఇక కేవలం భవనాలు మాత్రమే కాదు పురాతన కట్టడాలు కూడా కూలి పోవడం గమనార్హం. గోల్కొండ కోట లోని శ్రీ జగదాంబికా అమ్మవారి ఆలయం ముందు ఉన్న దాదాపు 27 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా  నేపథ్యంలో పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండడంతో ప్రమాదం తప్పిందని గోల్కొండ నిర్వాహకులు తెలిపారు. పది నెలల క్రితమే ఈ గోడపై ధ్వంసమైన కొన్ని బురుజులను పురావస్తు శాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. కాగా ప్రహరీ గోడ కిందిభాగంలో పగుళ్లు వచ్చిన నేపథ్యంలో... మొన్న కురిసిన భారీ వర్షానికి ఈ గోడ మొత్తం కుప్పకూలిపోయినట్లు  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: