గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రము ఏర్పడడంతో, ఇక్కడ ఏపీలో కష్టాలు ప్రారంభమయ్యాయని చెప్పవచు. ఎందుకు ఇలా అన్నానంటే...? అప్పుడే హైదరాబాద్ లాంటి మహానగరం ద్వారా వచ్చే అధ్యాన్ని మనము కోల్పోయాము. ఆ తరువాత ఏపీని ఆర్ధికంగా బలంగా చెయ్యాలంటే ముందుగా ఏపీకి రాజధాని కావాలి. ఇదే విషయంలో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఇబ్బందులకు కారణమవుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిని చేసిన తరువాత...అక్కడ ఏదో జరిగిపోతున్నది అనే భ్రమను ప్రజల్లో కలిగించాడు. కానీ వాస్తవంగా చూస్తే అక్కడ పెద్దగా అభివృద్ధి చెందింది లేదు. మొత్తానికి అక్కడున్న రైతులకు మరియు మాములు ప్రజలకు త్రిశంకు స్వర్గాన్ని చూపించింది. 

అమరావతిలో ఏమీ నిర్మించకుండా ఎంతసేపటికీ ప్లానింగ్ పేరుతో కాగితాల మీద డిజైన్ లు గానే మిగిలిపోయాయి. అక్కడ ఉన్న వెలగపూడి అలాగే ఉంది మరియు తాడేపల్లి అలాగే ఉంది. కాగా ౨౦౧౯ లో వైసీపీ గెలిచింది. టీడీపీ చేసిన పొరపాట్లను సర్దుబాటు చేసి, వీరు అభివృద్ధి చేయాలి. అలాకాకుండా రాజధాని వికేంద్రీకరణ చేయాలని చట్టం తీసుకొచ్చారు. కానీ ఇందులో స్పష్టత లేకుండా ఉంది. తాజాగా మరొక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అమరావతి స్మార్ట్ సిటీ ప్రాంతంలో చేపట్టాల్సిన ముఖ్యమైన పనులను అమరావతి రేగులటరీ డెవలప్మెంట్ అథారిటీ నుండి అమరావతి స్మార్ట్   సస్టైనబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట.

ఇందులో భాగంగా అమరావతి ప్రాంతంలో  మొత్తం 10 ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా మరొక కొత్త ప్రాజెక్టును కూడా పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పనులన్నీ కొత్తగా ఏర్పాటు చేసిన అమరావతి స్మార్ట్  సస్టైనబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారానే జరుగుతాయి. దీని కోసం అవసరమయ్యే  350 కోట్లు నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే వీరు చెబుతున్న ప్రాజెక్టులన్నీ ఈ నిధులతో చేయగలరా ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో లాగా టీడీపీ మార్చినట్లు ఉడా నుండి పలు శాఖలు నిర్వహిస్తాయని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ కొత్త విభాగం అయినా సరిగ్గా ప్రాజెక్టులను అమలు పరుస్తుందా వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: