ఈ మధ్య కాలంలో ప్రేమ అనే ముసుగులో జరుగుతున్న దారుణ ఘటనలో రోజురోజుకు పెరిగి పోతూనే ఉన్నాయి. ప్రేమ పేరు చెప్పి ఏకంగా ఎంతో మంది యువతులను నట్టేట ముంచుతున్నారు మోసగాళ్ళు. ప్రియుడే ప్రాణంగా బ్రతికిన వాళ్లు చివరి ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ మాయమాటలతో యువతిని నమ్మించిన ప్రియుడు చివరికి  పెద్దలు పెళ్ళికి ఒప్పుకోరు అంటూ చెప్పాడు. ఈ క్రమంలోనే ఇద్దరం కలిసి చచ్చి పోదాం అంటూ ప్రేమగా కల్లబొల్లి మాటలు చెప్పాడు.  ఇక ఇద్దరు కలిసి కూల్డ్రింక్లో పురుగుల మందు కలుపుకున్నారు. ముందు నువ్వు తాగు తర్వాత నేను తాగుతాను అంటూ చెప్పాడు.



 ఇక ప్రియుడి మాటలు నమ్మిన ప్రియురాలు పురుగుల మందు కలిపిన కూల్డ్రింక్ తాగింది. కానీ ఆ తర్వాత ట్విస్ట్ ఇచ్చాడు.  వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఆ యువతి షాక్ అయ్యింది. ఈ ఘటన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం లోని ఇంటూరు లో చోటుచేసుకుంది  గ్రామానికి చెందిన ఉమామహేశ్వర రావు అనే 38 ఏళ్ల వ్యక్తి అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతితో ఏడాదిగా ప్రేమాయణాన్ని సాగిస్తున్నాడు  ఇక ప్రేమ పెళ్లి అంటూ ఎన్నో మాయమాటలతో ఆ యువతిని నమ్మించాడు. ఈ క్రమంలోనే అన్ని రకాల అవసరాలను తీర్చుకునేవాడు. ఇక ఇటీవలే తనను పెళ్లి చేసుకోవాలి అంటూ యువతి ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. దీంతో ఎలాగైనా ప్రియురాలిని హత మార్చాలి అనుకున్నాడు.



 పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని ఇక చావులో అయిన కలిసి వెళ్దాం అంటూ మాయమాటలతో నమ్మించాడు. ఈ క్రమంలోనే గోవాడ శివాలయంలోని రోడ్డులో ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ తమ వెంట తెచ్చుకున్న కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపాడు   ఈక్రమంలోనే ప్రియురాలికి ఇచ్చాడు. మాయ మాటలు నమ్మిన ప్రియురాలు పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగింది. ఇక అంతలోనే కేటుగాడు ట్విస్ట్ ఇచ్చి అక్కడి నుంచి పారిపోయాడు.ఇక విషయం తెలుసుకున్న యువతి బంధువులు వెంటనే అక్కడికి చేరుకొని యువతిని ఆసుపత్రిలో చేర్పించారు. ఇక ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరపగా ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉమామహేశ్వరరావుకి గతంలోనే రెండు పెళ్లిళ్లు అయ్యాయని ఒక భార్య ఆత్మహత్య కూడా చేసుకుని చనిపోయింది అన్న విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: