కొంత అబద్ధాలు చెబుతున్న నైజమూ ఉంది. కానీ కొన్ని విషయాల్లో వైసీపీ సర్కారు తమ తప్పిదాలను ఒప్పుకుంటుంది కూడా! అప్పులపై మాత్రం తాము శ్వేత పత్రం విడుదల చేసేందుకు కూడా సిద్ధం అనే అంటోంది.ఈ దశలో ఉద్యోగుల సమ్మె విషయం ఒకటి కలవరం రేపుతోంది.బీజేపీ ఎంపీ జీవీఎల్ ఏవేవో మాట్లాడినప్పటికీ అవేవీ పట్టించుకునే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు.బీజేపీని నమ్ముకుంటే చాలు ఉద్యోగులూ మీ సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని చెప్పడం పెద్ద హాస్యాస్పద విషయం.ఇది కాకుండా ఇంకేమయినా మాట్లాడమనండి జీవీఎల్ నే కాదు సోము వీర్రాజును కూడా సమర్థ నాయకులుగానే పరిగణిస్తాం. రెండు జాతీయ పార్టీలు కూడా రాష్ట్రానికి చేసిన సాయం కన్నా చేయని సాయమే ఎక్కువ.కనుక ఇలాంటి జోక్స్ మళ్లీ మళ్లీ ప్లే చేయకండి జీవీఎల్.
ఇక టీడీపీ సమ్మె విషయమై ఏం మాట్లాడుతుందో కూడా చూద్దాం. ఉద్యోగుల డిమాండ్లు న్యాయ సమ్మతమే అని చెబుతూనే సమ్మెకు మద్దతు ఇస్తామంటోంది. అవును! ఇది రాజకీయంగా తమవైపు తిప్పుకునే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఆ రోజు ఆర్థికంగా రాష్ట్రం ఉన్న స్థితి వేరు ఇప్పుడు వేరు.43 శాతం ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఆర్థిక అస్తవ్యస్తత లేదు. ఇప్పుడు మాత్రం పథకాల కారణంగానో లేదా కరోనా కారణంగానో ఉంది. కనుక టీడీపీ వర్గాలు సమ్మెను రాజకీయంగా వాడుకోవడం అన్నది కుదరని పని. ఎందుకంటే ఇప్పుడు ఏం మాట్లాడినా రేపు అది మెడకు చుట్టుకోవడం ఖాయం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ చతురత ఈ విషయంలో నెగ్గదు గాక నెగ్గదు.