
మొదట ఆయన జనసేనలో చేరాలనే ఆలోచనలో ఉన్నా... చీరాల నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు దృష్ట్యా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో టిడిపి బలమైన కేడర్ కలిగి ఉండడం, అలాగే జనసేనలో టికెట్ దొరుకుతుందో లేదో అనుమానం రావడం వల్ల ఆమంచి వైసీపీ మనసు వైసీపీ వైపు లాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఆయన మళ్లీ గతంలో వదిలేసిన వైసీపీలో తిరిగి చేరేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ నేతలు కూడా ఆయన రాకపై సానుకూలంగా ఉన్నారని సమాచారం. పార్టీకి చీరాలలో బలమైన నాయకత్వం అవసరమని, ఆమంచి కృష్ణమోహన్ వంటి ఫైర్ బ్రాండ్ లీడర్ ఉంటే జనసేన - టిడిపి కూటమిని బలంగా ఎదుర్కోవచ్చని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.
ఇక చీరాల వైసీపీ నేత కరణం బలరాం కృష్ణమూర్తి పార్టీలోనే కొనసాగితే .. వచ్చే ఎన్నికల నాటికి ఆయనను అద్దంకికి మార్చాలన్న టాక్ ఉందని వైసీపీలో అంతర్గతంగా వినిపిస్తోంది. వైసీపీ ఇప్పటికే ఆమంచి కృష్ణమోహన్కు ఆహ్వానం పంపేందుకు సిద్ధమైందని, త్వరలోనే ఆయన అధికారికంగా పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. ఇది జరిగితే చీరాల రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. ఆమంచి కృష్ణమోహన్ రీ-ఎంట్రీతో వైసీపీ మళ్లీ చీరాలో పట్టు సాధించే అవకాశం ఉన్నాయి.