అయితే దీపక్ చాహార్ కి దాదాపు 568 రోజుల తర్వాత ఐపీఎల్లో ఇదే మొదటి వికెట్ అని చెప్పాలి. ఎందుకంటే చివరగా ఐపీఎల్ 2021 ఫైనల్ లో వికెట్ తీశాడు. తర్వాత గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి కూడా దూరం అయ్యాడు. ఇక 2023 సీజన్లో సీఎస్కే తరఫున ఆడిన మొదటి మ్యాచ్ లోనే గాయం కారణంగా మళ్ళీ దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గతంలో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి 41 పరుగులు సమర్పించుకోవడంతో విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇటీవల ముంబై తో జరిగిన మ్యాచ్లో మాత్రం మూడు ఓవర్లు వేసిన దీపక్ చాహార్ 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసాడు.
ఇన్నింగ్స్ మూడో ఓవర్ రెండో బంతికి తొలిత ఇషాన్ కిషన్ ను ఔట్ చేసిన దీపక్ చాహార్ ఆ తర్వాత నాలుగో బంతికి ధోని సూచనల మేరకు రోహిత్ ను బుట్టలో వేసుకొని రెండో వికెట్ను కూడా సంపాదించాడు. అయితే ధోని ఇచ్చిన సలహాతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం దీపక్ చాహార్ ను వదిలేయకుండా 14 కోట్లకు తమతోనే అంటిపెట్టుకుంది. అయితే ఇటీవలే దీపక్ చాహార్ దాదాపు 568 రోజుల తర్వాత తొలి వికెట్ సాధించడంతో.. ఒక్క వికెట్ విలువ 28 కోట్లు అంటూ ఒక అభిమాని పోస్ట్ చేయగా ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఏది ఏమైనా దీపక్ చాహార్ రాకతో చెన్నై బౌలింగ్ మరింత పటిష్టంగా మారింది.