ఇందులో భాగంగా పరమేశ్వరుడు, పార్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వారి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. మీ కుటుంబ సభ్యులు వ్రతం చేయడం వలన మీ పిల్లలు మానసికంగా వృద్ధి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. మరియు కొంచెం అయోమయంగా ఉండే పిల్లలకు తెలివి తేటలు వృద్ధి చెందుతాయి. అంతే కాకుండా చిన్నారులు ఆరోగ్యంగా ఉండటమే కాదు... వారి భవిష్యత్తు చక్కగా ఉంటుంది. ఈ వ్రతం వలన సర్వ దోషాలు తొలగిపోతాయని ప్రతీతి. అయితే ఏ సమయంలో ఈ వ్రతాన్ని చేయాలో తెలుసుకుందామా...?
ఈ ప్రదోష వ్రతానికి బుధవారం నాడు ఉదయం 10.40 కి ప్రారంభమవుతుంది. అది తిరిగి గురువారం అంటే మార్చి 11న మధ్యాహ్నం 2.37కి ప్రదోష వ్రత కాలం పూర్తవుతుంది. ఈ సమయంలో ఎప్పుడైనా ఈ వ్రతం చేపట్టవచ్చు. ఈ వ్రతం చేపట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసిన వారికి ఆ పార్వతీ పరమేశ్వరుల దీవెనలు అందుతాయి. మీ కోరికలు నెరవేరడమే కాకుండా... భవిష్యత్తు కూడా బాగుంటుంది. మీ యొక్క భక్తిని ఈ శివరాత్రి పర్వ దినాన నిరూపించుకోండి. వీలైతే శ్రీకాళహస్తి లోని శివాలయాన్ని దర్శించండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి