
మన పురాణాలలో శాస్త్రాలలో ఏ ఏ రోజు ఏ ఏ దేవుడికి పూజిస్తే మంచిది అనేది చాలా చక్కగా వివరించారు . శాస్త్రల ప్రకారం ఆదివారం సూర్య ఆరాధనకు శ్రేష్టమైనది అని అందరికీ తెలిసిందే . అలాగే సోమవారం మహా శివుడికి ..మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ..ఆంజనేయస్వామిని విశేషంగా పూజిస్తూ ఉంటారు . ఇక బుధవారం నాడు గణపతి పూజ ..అయ్యప్ప స్వామి పూజకు ..శ్రీరాముడు.. శ్రీకృష్ణుడు ఆరాధనకు శ్రేష్టమైనది అని చెప్పుకోవాలి . గురువారం సాయిబాబా.. దక్షిణామూర్తి.. దత్తాత్రేయ స్వామికి చాలా చాలా ప్రత్యేకమైనది.
ఆ గురువారం నాడు సాయిబాబా ని.. దక్షిణామూర్తిని ..దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అంటుంటారు మన ఇంట్లోని పెద్దవాళ్ళు . ఇక శుక్రవారం లక్ష్మీదేవిని దుర్గాదేవిని పూజిస్తూ ఉంటారు ఇంట్లోని ఆడవాళ్లు . కాగ శనివారం మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఎందుకు శనివారం వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టికి మూలంగా భావించే ఓంకారం ప్రభావించిన రోజు శనివారమే . ఆ కారణంగానే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు . అందుకే శ్రీనివాసుని పూజకు శనివారం చాలా విశిష్టమైనది. శ్రీనివాసుడు తనకు ఆలయాన్ని నిర్మించమని తొండమణ్ చక్రవర్తిని ఆదేశించింది కూడా ఈ శనివారం నాడే కావడం అందుకు ప్రధాన కారణం . శ్రీనివాసుడు తొలిసారిగా ఆలయం ప్రవేశం చేసింది కూడా శనివారం నాడే . శ్రీనివాసుడు,, శ్రీ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నది కూడా శనివారమే . అంతేనా శ్రీనివాసునికి ఎంతో ఇష్టమైన చక్ర తల్వార్ అని పిలిచే సుదర్శన చక్రం పుట్టింది కూడా ఈ శనివారమే . ఇన్ని ప్రత్యేకతలు ఉన్న శనివారం అంటే ఏడుకొండలవాడికి పరమ ప్రీతి . ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా వెంకటేశ్వర స్వామిని శనివారం నాడు కొలుచుకుంటూ ఆరాధిస్తూ పూజలు చేస్తే మాత్రం ఆయన శని బాధల నుంచి విముక్తి కలిగిస్తాడు..!
నోట్ : పైన తెలిపిన ఈ వివరాలు కొందరు నిపుణులు అలాగే వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం మాత్రమే.