ఎందుకంటే సుదీర్ఘమైన ఫార్మాట్ లో ఎక్కువ సేపు మైదానంలో క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. కాబట్టి ఏకాగ్రత తో పాటు అటు శారీరకమైన ఫిట్నెస్ కూడా ఎంతో అవసరం అని చెప్పాలి. అందుకే అటు టెస్టు ఫార్మాట్లో ఎక్కువ రోజులు కొనసాగె ఆటగాళ్ళ సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. అంతే కాదు టెస్ట్ ఫార్మాట్లోనూ అరుదైన మైలురాయిని అందుకోవడం అంటే అది అరుదైన విషయమని చెప్పాలి. ఇటీవల శ్రీలంక క్రికెటర్ ఇలాంటి అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. 100 టెస్టులు ఆడిన ఆరో క్రికెటర్గా అరుదైన రికార్డు సృష్టించాడు.
ఇలా శ్రీలంక జట్టు తరఫున వంద టెస్టుల్లో మైలురాయిని అందుకున్న ఆటగాడు ఎవరో కాదు ఏంజెలో మాథ్యూస్. ఇటీవలే ఈ అరుదైన రికార్డు సాధించాడు. శ్రీలంక జట్టు తరఫున 100 టెస్టులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ళ లిస్టులో చేరిపోయి అరుదైన రికార్డు సాధించాడు అనే చెప్పాలి. పాకిస్థాన్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ద్వారా ఈ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు శ్రీలంక దిగ్గజ క్రికెటర్ జయవర్ధనే 149 టెస్టులు, మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 134 టెస్టులు, మురళీధరన్ 133, చమిందా వాస్ 111 టెస్టులు, జై సూర్య 110 టెస్ట్ లు మాత్రమే ఆ దేశం తరఫున వంద టెస్టులు ఆడిన ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు ఏంజెలో మాథ్యూస్ ఈ అరుదైన రికార్డు సాధించి ప్రేక్షకులను ఆనందంలో ముంచేశాడు.