
క్లిష్ట పరిస్థితుల్లో అందరూ ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతూ ఉంటే అటు మహేంద్రసింగ్ ధోని మాత్రం సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. అందుకే వరల్డ్ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్లలో ఇక ధోనికి మొదటి వరుసలో చోటు దక్కుతూ ఉంటుంది. ఇక ధోని ఫినిషింగ్ గురించి ఇప్పటికీ కూడా ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఎంతో గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఓ యువ ఆటగాడు సైతం ధోని ఫినిషింగ్ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ ఫినిష్ చేయడంలో ధోని మాస్టర్ అంటూ చెప్పుకొచ్చాడు రియాన్ పరాగ్.
మ్యాచ్ ను ఎంతో విజయవంతంగా ఫినిష్ చేయడంలో అతని దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రియాన్ పరాగ్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి అయినా తాను సిద్ధమే అంటూ చెప్పుకొచ్చాడు. కానీ నన్ను ఎంపిక చేసుకోమని అడిగితే మాత్రం నాలుగో స్థానాన్ని ఎంపిక చేసుకుంటా. ఎందుకంటే ఫినిషిర్ పాత్ర పోషించడం నాకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నాకు ఫినిషర్ అంటే గుర్తుచేది ధోనినే. మ్యాచ్ ను మలుపు తిప్పడం ముగించడం విషయంలో ధోనీ నుంచి అన్ని విషయాలను నేర్చుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు.