చాలామంది సెలబ్రిటీలు సైతం కొన్ని సందర్భాలలో చావు నుంచి బయటపడ్డామని తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులను సెలబ్రిటీల సైతం తెలియజేస్తూ ఉంటారు. కానీ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏది జరిగినా కూడా ప్రేక్షకులకు చేరాలంటే చాలా సమయం పట్టేది.. ముఖ్యంగా సినిమాలు తీసేటప్పుడు కూడా నేచురల్ గానే తీసి ప్రేక్షకులను మెప్పించేవారు దర్శక నిర్మాతలు.. అందుకే పూర్వపు సినిమాలన్నీ కూడా చాలావరకు సహజంగానే కనిపిస్తూ ఉంటాయి. అలా ఎన్నో సన్నివేశాలు తీసేటప్పుడు బయట ప్రపంచానికి తెలియని కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి.


ఇలాంటి సందర్భాలలో స్టార్స్ సైతం కాళ్లు చేతులు విరుగొట్టుకుంటూ కూడా ఉంటారు. మరి కొంతమంది చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఒక సంఘటన నటి రాజ్యలక్ష్మి కెరియర్లో జరిగిందట.. దాదాపుగా అన్ని భాషలలో కలుపుకొని ఇప్పటివరకు 100కు పైగా చిత్రాలలో నటించింది రాజ్యలక్ష్మి ముఖ్యంగా ఈమె ఇవి సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన చెవిలో పువ్వు అనే సినిమాలో నటిస్తున్న సమయంలో ఈమె చావు అంచుల నుంచి బయటపడిందట.


ఒక మండపంలో ఆమె ఉరి వేసుకొని చనిపోయే సన్నివేశం చిత్రీకిస్తున్న సమయంలో అది నాచురల్ గా రావడం కోసం నిజంగానే ఆమెకు ఒక తాడు కట్టి లాంగ్ షాట్ లో షూటింగ్ చేస్తున్నారట. అయితే సమయంలో  ఊరి బిగించుకోవడంతో ఆమెకు సహాయం చేయడానికి కూడా ఎవరిని కనిపించకుండా దూరంగా పెట్టారట.కానీ ఆమెకు పడ్డ ఊరిని మర్చిపోవడంతో కెమెరా తీస్తున్న వ్యక్తులు ఉన్నప్పటికీ గమనించలేకపోయారట. చివరి క్షణాలలో ఆమె కళ్ళు తేలేస్తున్న సమయాన్ని గమనించే సరికి దాదాపుగా చావు అంచుల చివరి వరకు వెళ్లిందట.. ఆ తరువాత వెంటనే చిత్ర బృందం అలర్ట్ అయి ఆ తాడును తప్పించి ఆమెను మేలుకొలిపి తిరిగి మళ్ళీ అదే షార్టును పూర్తి చేశారట. అలా రాజ్యలక్ష్మి చావు అంచులకు వెళ్లి తప్పించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: