జంతువులలో అసలు ఎలాంటి కల్మషం ఉండదు. అలాంటి జంతువులను ప్రేమగా చూసుకుంటే.. అవి కూడా అంతే ప్రేమతో.. విశ్వాసంతో మనతో జీవితాంతం ఉంటాయి.మన భావాలను కూడా అవి అర్ధం చేసుకుని.. ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు అసలు వెనుకాడవు. అందుకే చాలామంది కూడా పెంపుడు జంతువులను ఇళ్లలో పెంచుకుంటారు. అలాంటి విశ్వాసమైన జంతువుల్లో కుక్క ముందు వరుసలో ఉంటుంది. తాజాగా ఓ గేదె కూడా యజమాని ప్రాణాలను కాపాడి పాపం తనువుచాలించింది. కరెంట్‌ షాక్‌తో యజమాని వెంటనే కుప్పకూలగా.. అతన్ని కాపాడేందుకు ఆ గేదె పరుగులు తీసుకుంటూ వచ్చింది. అయితే.. చివరికి అదే కరేంట్‌ వైర్లు ఆ గేదెకు అంటుకోవడంతో ప్రాణాలు వదిలింది. ఇక ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో చోటుచేసుకోగా.. గేదె రియల్ స్టోరీపై సర్వత్రా చర్చ అనేది జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..భదోహిలోని బాబుసరాయ్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల పరాస్ పటేల్ రాత్రి ఇంటి బయట మంచం మీద నిద్రిస్తున్నాడు.అప్పుడు అర్ధరాత్రి అకస్మాత్తుగా వర్షం మొదలైంది.ఇక పరాస్ పటేల్ తన మంచంతో ఇంటి లోపలికి వెళ్లబోయాడు. ఆ సమయంలో విద్యుత్‌ తీగ కిందపడటంతో ఈ ఘటన అనేది జరిగింది.


కిందపడిన ఆ విద్యుత్‌ తీగను పరాస్ పటేల్ కర్రపై నుంచి తీసే ప్రయత్నం మొదలుపెట్టాడు. అయితే ఆ వైరు ఇంకా అతని శరీరానికి తాకింది. దీంతో పాపం పరాస్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన అతని కుమారుడు శివశంకర్ అక్కడికి చేరుకుని తన తండ్రిని రక్షించే ప్రయత్నం చేయబోయాడు. ఆ సమయంలో అతను కూడా షాక్‌కు గురై ఎంతగానో విలపించాడు. ఈ క్రమంలో వారి గేదె పక్కనే కట్టేసి ఉంది.తన యజమాని కష్టాల్లో ఉండటాన్ని చూసిన ఆ గేదె.. కట్టేసిన కర్రను పెకిలించుకొని మరి శివశంకర్‌ని రక్షించడానికి పరిగెత్తింది. తన యజమానిని కాపాడే క్రమంలో అది కూడా తీగకు అంటుకుంది. అయితే పరుగున వచ్చిన ఆ గేదెను యాజమానిని నెట్టి అది ప్రాణాలు కోల్పోయింది. కాగా.. పాపం తీవ్ర గాయాలపాలైన శివశంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రాణాన్ని పణంగా పెట్టి యజమానిని కాపాడిన ఆ గేదె గురించి అంతటా చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: