యమహా ఆర్.ఎక్స్100.. అప్పట్లో యువతలో ఈ బైక్ కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్కసారి ఈ బైక్ కి అలవాటు పడ్డారంటే వారు మరో బైక్ ని రైడ్ చేయడానికి ఇష్టపడరు.ఇప్పటికీ కూడా చాలా మంది ఈ బైక్ ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా ఈ బైక్ కొనడానికి దొరకదని బాధ పడుతూ ఉంటారు. అలాంటి వారికి తాజాగా యమహా కంపెనీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఒకప్పుడు ఫుల్ హల్ చల్ చేసిన యమహా ఆర్.ఎక్స్100 బైక్ కొన్ని అనివార్య కారణాల వల్ల మార్కెట్లో అదృశ్యమైపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆర్.ఎక్స్100 మళ్ళీ ఎంట్రీ ఇస్తుందంటూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వివరాలు కొత్త జనరేషన్ రైడర్‌ లకు అనుకూలంగా డిజైన్ చేయబడుతున్నట్లు అనిపిస్తున్నాయి.ఇందులో భాగంగా... 225.9సీసి ఇంజిన్ కలిగి ఉండొచ్చని సమాచారం తెలుస్తుంది.అలాగే 20.1 బీహెచ్పీ, 19.93 ఎన్ఎమ్ మ్యాగ్జిమమ్ టార్క్ విడుదల చేస్తుందని తెలుస్తుంది.


ఇంకా బీఎస్ 6 ఫేజ్ 2 హార్ష్ ఎమీషన్స్ కు తగ్గట్లుగానే ఈ న్యూ వెర్షన్ డిజైన్ చేసినట్టు నివేదికల నుంచి సమాచారం తెలుస్తుంది. ఇక ఈ కొత్త యమహా బైక్ ధర విషయానికొస్తే... రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు.యమహా ఆర్‌.ఎక్స్‌ బైకులను ఆపేసి సుమారు 25 ఏళ్ళు దాటిన సంగతి తెలిసిందే.అయినప్పటికీ ఈ బైక్ లు అప్పుడప్పుడూ రోడ్డుపై మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే యమహా ఆర్.ఎక్స్100 రీలాంచ్ కావాలని చాలా మంది భావిస్తున్నారు. ఈ బైక్ 1985 నుంచి 1996 దాకా మార్కెట్ లో కొనసాగింది.ప్రస్తుతం ఈ విషయంపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక  ప్రకటన లేదు. 2022లో కూడా యమహా ఆర్ఎక్స్100 మళ్లీ రాబోతుందని వార్తలొచ్చాయి. అయితే అప్పట్లో యమహా ఇండియా ప్రెసిడెంట్ ఇషిన్ చిహానా ఆ కథనాలపై స్పందిస్తూ... ఆర్.ఎక్స్100 మళ్లీ రానుందని చెప్పారు.మరి చూడాలి ఎప్పుడు వస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: