ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, కె. విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన  ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యముగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. గతంలో  కె.విశ్వనాథ్ గారి ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్ళి  పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యం పై చర్చించిన విషయాన్ని సీఎం  కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. భారతీయ సామాజిక సంస్కృతీ  సంప్రదాయ విలువలకు తన సినిమాలలో కె. విశ్వనాథ్  పెద్ద పీట వేశారని సిఎం కేసీఆర్ అన్నారు.


సంగీత సాహిత్యాన్ని  ప్రధాన ఇతివృత్తంగా, మానవ సంబంధాల  నడుమ నిత్యం తలెత్తే  వైరుధ్యాలను  అత్యంత సృజనాత్మక గా సున్నితంగా దృశ్యమానం  చేసిన గొప్ప భారతీయ దర్శకుడు కె విశ్వనాథ్ అని సిఎం కేసీఆర్‌ ఘనంగా నివాళి అర్పించారు. దాదా సాహెబ్ ఫాల్కే , రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన దర్శక ప్రతిభకు కలికి తురాయిగా నిలిచాయని  సిఎం కేసీఆర్‌ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: