దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది కరోనా భారీన పడ్డారు. గత 24 గంటల్లో ఐటీబీపీలో విధులు నిర్వహిస్తున్న 8 మంది పోలీసులకు కరోనా నిర్ధారణ అయింది. 
 
ఐటీపీబీ సిబ్బందిలో 221మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 70 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ఇతర సిబ్బందిని భయపెడుతోంది. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 16,922 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు దాదాపు 17,000 కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: