ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్లపై బిహార్ దళిత నాయకుని
హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిద్దరితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.దళిత నాయకుడు
శక్తి మాలిక్
హత్య ఆదివారం ఉదయం జరిగింది. బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనను సొంత నివాసంలోనే తుపాకీతో కాల్చి హత్యచేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అయితే
హత్య జరిగిన తర్వాాత ఓ వీడియో వైరల్గా మారింది.
రాణిగంజ్ ఎమ్మెల్యే టికెట్ దక్కాలంటే పార్టీకి రూ. 50లక్షలు విరాళంగా ఇవ్వాలని.. లేకపోతే తనను అంతమొందిస్తానని తేజస్వీ యాదవ్ బెదిరించినట్లు ఆ వీడియోలో చెప్పారు
శక్తి మాలిక్.
ఈ
హత్య కేసుకు సంబంధించి తేజస్వీ, తేజ్ ప్రతాప్లు సహా మొత్తం ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పూర్నియా
జిల్లా ఎస్పీ విశాల్ శర్మ తెలిపారు. బిహార్
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీపై ఈ కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.