గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ప్రస్తుతం చిన్న చిన్న ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఓటింగ్ విషయంలో ఎన్నికల సంఘం చాలా వరకు జాగ్రత్తలు చేపట్టింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి బంజారాహిల్స్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.  పోలింగ్ ప్రశాంతవాతావరణంలో జరుగుతుందనే నమ్మకం తనకు ఉన్నట్టు చెప్పారు.

ఫ్లైయింగ్ స్వ్కాడ్స్, స్టాటిస్టిక్స్ సర్వే టీమ్‌లు చురుగ్గా పని ప్రారంభించాయని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య వస్తే 105 స్ట్రైకింగ్ ఫోర్స్ రెడీ గా ఉన్నతు వెల్లడించారు. 56 స్పెషల్  స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా రెడీగా ఉన్నాయని, లైవ్ క్యాస్టింగ్ పెట్టామని ఆయన పేర్కొన్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా తాము చర్యలు తీసుకున్నామని ఆయన మీడియాకు చెప్పారు. ప్రజలు ఎవరూ కూడా కంగారు పడవద్దు అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: