దువ్వాడ శ్రీనివాసరావు అనుకున్న విధంగా ఈ సారి విజయం లేదు. ఎమ్మెల్సీ పదవి ఉందన్న ఆనందంలో ఆయన ఏమయినా మాట్లాడవచ్చు కానీ అందుకు అనుగుణంగా రాజకీయం లేదు. దీంతో నందిగాం మండలం (వివాదాలకు తావిచ్చిన ఎంపీపీ పదవి) ఎంపీపీ పదవి విషయమై సీఎంఓ జోక్యం చేసుకుంది. సీఎంఓ కాల్ చేసి మరి నందిగాం మండలం ఎంపీపీగా నడుపూరి శ్రీరామూర్తి పేరును ఖరారు చేసింది. ఈయన గతంలో సాక్షి విలేకరిగా నందిగాం మండలంలో పనిచేశారు. ఈయనకు దువ్వాడ వ్యతిరేక వర్గం మద్దతు ఉంది. దీంతో దువ్వాడ ప్రవర్తనతో విభేదిస్తున్న పేడాడ తిలక్ వర్గం ఆనందోత్సాహాల్లో ఉంది. కష్టపడి పని చేసే వాడికి ఈ పార్టీ లో ఎప్పుడు సముచిత స్థానం ఉంటుంది అనడానికి నిదర్శనం ఈ తీర్పు అని కూడా అంటో్ంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి