పోలేపల్లి గ్రామం మీదుగా ఎర్రమట్టితండా, బోటిమెడ తండా, పాలెం తండా, చౌల తండా, చాకలి షేర్పల్లి గ్రామానికి చేరుకున్నది. మార్గమధ్యలో వర్షం కురిసినప్పటికీ పాదయాత్రను కొనసాగిస్తూ రైతులను స్థానిక ప్రజలను కలుసుకుంటూ ముందుకు సాగారు. పాదయాత్రలో నిర్వహించిన మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పెన్షన్, తెల్లరేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ రాక నిరుద్యోగి మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తుచేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. సీఎంలో చలనం కనిపించడం లేదని ఆమె దుయ్యబట్టారు. రాజన్న బిడ్డగా తెలంగాణ ప్రజలకు సేవ చేయడం తన హక్కు కాదా అని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. అదేవిధంగా రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కేసీఆర్ కుటుంబానికేనా అని ఆవేదన వ్యక్తం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి