ఒకప్పుడు కేవలం పరాయి వ్యక్తులనుంచి మాత్రమే ప్రాణ హాని ఉంది అని నమ్మేవారు జనాలు. అందుకే పరాయి వ్యక్తుల జోలికి పోకుండా ఏదో తప్పు చేసుకుంటూ హాయిగా జీవించడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం పరాయి వ్యక్తులు కాదు మాత్రమే సొంతింటి వారి నుంచి కూడా ప్రాణహరి ఉంటుంది అన్నది నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలను చూస్తుంటే అర్థమవుతుంది.


 ఇలా ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు చూసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఏకంగా కడుపున పుట్టిన పిల్లలు తల్లిదండ్రుల ప్రాణాలు తీస్తుంటే మరోవైపు కనిపెంచిన తల్లిదండ్రులే పిల్లల ప్రాణాలను తోడేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే అందరిని నివ్వెర  పోయేలా చేస్తుంది అని చెప్పాలి. జల్సా లకు అలవాటు పడి.. వ్యాపారంలో నష్టపోయిన ఒక యువకుడు ఏకంగా తల్లిదండ్రులని చంపేందుకు సిద్ధపడ్డాడు. ఇక సొంత ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు.


 ఈ ఘటన ముంబై లోని బాంద్రా వెస్ట్ రిక్లమేషన్ సమీపం లో వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. పారిజాత అనే అపార్ట్మెంట్లో రాహుల్ అనే 24 ఏళ్ల యువకుడు తల్లి దండ్రుల తో కలిసి ఉంటున్నాడు. అయితే డబ్బు సంపాదించడం కోసం వ్యాపారం లో పెట్టుబడి పెట్టగా చివరికి నష్టాల పాలయ్యాడు. అదే సమయం లో జల్సాలకు పోయి చెడు అలవాట్లకు బానిసగా మారి పోయాడు. ఇటీవల ఏకంగా సొంత తల్లిదండ్రులు మెడ పై కత్తి పెట్టి బెదిరించి 1.14   కోట్ల రూపాయలు చోరీ చేశాడు. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాహుల్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: