శారీరక సుఖం కోసం ఆడవాళ్ళు అడ్డదారులు తొక్కుతున్నారు..అవసరాలను తీర్చుకోవడానికి ప్రేమ అని పేరు పెట్టుకొని నీచానికి పాల్పడుతున్నారు.అయితే ఓ వివాహిత బాయ్ ఫ్రెండ్ తో సుఖాన్ని అనుభవించడానికి సొంతవాల్లనే దారుణంగా చంపేసింది.అసలు విషయానికొస్తే.. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం వి.వి.మెరకలో ఇటీవల జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కక్షతో ప్రియుడితో కలసి భార్యే హత్య చేయించినట్లు విచారణలో వెల్లడైంది. 

 

 

జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అమలాపురం డీఎస్పీ మాసూమ్‌బాషా సోమవారం రాజోలు పోలీస్‌‌స్టేషన్‌లో వెల్లడించారు. వీవీమెరక ప్రగతినగర్‌కు చెందిన ఉప్పు ప్రసాద్‌(48) ఈ నెల 2న మృతి చెందాడు. కేసువదాసుపాలేనికి చెందిన రౌడీషీటర్‌ చొప్పల సుభాకర్‌ అలియాస్‌ శివ, తల్లి ఉప్పు ప్రశాంతి కలసి తన తండ్రిని హత్య చేసినట్లు మృతుని కుమార్తె ఈ నెల 24న సఖినేటిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు. 

 

 

పోలీసులు హత్యగా తేల్చారు. ఉప్పు ప్రసాద్‌ తన ఇంటి వద్దనే సోడా దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి భార్య ప్రశాంతికి రౌడీషీటర్‌ చొప్పల సుభాకర్‌ అలియాస్‌ శివ‌తో చాలాకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది.భర్త పని నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరు సుఖ భోగాలను అనుభవిస్తారు..అలా వారి సంబంధం సాఫీగా సాగుతుంది.  ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్ పద్ధతి మార్చుకోవాలని భార్యను అనేక సార్లు హెచ్చరించాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తమ సుఖానికి అడ్డు పడుతున్న ప్రసాద్‌ను చంపేయాలని జ్యోతి, శివ నిర్ణయించుకున్నారు. తమకు మధ్యవర్తిగా వ్యవహరించే యడ్ల ప్రమీలా రాణి అనే మహిళ సాయంతో శివ నిద్రమాత్రలు ప్రియురాలికి పంపించేవాడు. వాటిని ప్రశాంతి భర్త తినే ఆహారంలో కలిపేది. అలా ఆయన కొద్దిరోజుల తర్వాత చనిపోయాడు. విషయాన్ని చేదించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: