గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూలై 5వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం

 

ముఖ్య సంఘటనలు


1687: సర్ ఐజాక్ న్యూటన్ ఫిలాసఫి నేచురాలిస్ ప్రిన్సిపియా మేథ్ మెటికా అనే గ్రంథాన్ని ప్రచురించాడు.
1811: వెనెజులా దేశం స్పెయిన్ దేశం నుంచి స్వతంత్రం ప్రకటించుకొంది.
1946: బికినీ ఈత దుస్తులను, పారిస్ ఫేషన్ షో లో, మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు.
1954: గుంటూరులో 1954 జూలై 5 నాడు ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును నెలకొల్పారు. కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై 1937 నవంబరు 15 న సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హైకోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హైకోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
1954: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బి.బి.సి.) తన మొట్టమొదటి టెలివిజన్ వార్తా వాహినిని ప్రసారం చేసింది.
1962: అల్జీరియా దేశం స్వతంత్రం పొందింది (ఫ్రాన్స్ నుంచి).
1975: కేప్ వెర్డె దేశం స్వతంత్రం పొందింది (పోర్చుగల్ నుంచి).
1977: పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కుట్ర చేసి, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన జుల్ఫికర్ ఆలి భుట్టో ను, ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించారు.
1995: సోవియట్ రష్యా నుంచి స్వతంత్రం పొందిన నాలుగు సంవత్సరాల తరువాత, ఆర్మీనియా దేశం తన స్వంత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంది.
1996: మొట్టమొదటిసారి, క్లోనింగ్ ద్వారా పెద్ద గొఱ్ఱె నుంచి సేకరించిన గొఱ్ఱె జీవ కణం ద్వారా డాలీ అనే పేరు గల గొఱ్ఱె ను శాస్త్రవేత్తలు పుట్టించారు.
2004:లోక్ సభ స్పీకర్ సోమనాధ్ చటర్జీ ఆదేశాల పై 2004 జూలై 5 నుంచి లోక్ సభ లో జరిగే శూన్య గంట (జీరో అవర్) చర్చలను, ప్రత్యక్ష ప్రసారం చేయటం మొదలుపెట్టారు.


జననాలు

1853: రొడీషియా (నేటి జింబాబ్వే) దేశాన్ని స్థాపించిన సెసిల్ రోడ్స్
1906: ఘంటసాల బలరామయ్య, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. (మ.1953)
1927: రావూరి భరద్వాజ, తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (మ.2013)
1956: చౌలపల్లి ప్రతాపరెడ్డి,1994లో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు, షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి 9838 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యాడు.
1979: నవీన షేక్, రంగస్థల, సినీ, టివీ నటి.
1980: కళ్యాణ్ రామ్, తెలుగు సినిమా నటుడు, నందమూరి తారక రామారావు మనవడు.
1995: పి.వి. సింధు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. పలు అంతర్జాతీయ పోటీలలో విజయకేతనం ఎగురవేసింది.


మరణాలు


2017: కంచర్ల సుగుణమణి, సంఘసేవకురాలు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అనుయాయి (జ.1919)


పండుగలు, జాతీయ దినాలు

అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి: