ప్రభాస్ హీరోగా
బాలీవుడ్ లో
ఆది పురుష్ అనే ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతుంది. రామాయణం ఆధారంగా ప్రముఖ
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో నిమగ్నమై ఉంది. ఈ చిత్రానికి భారీ స్థాయిలో
గ్రాఫిక్స్ అవసరం ఉండటంతో చిత్రీకరణ కంటే ఎక్కువ సమయాన్ని దీని కోసమే తీసుకున్నారు.
ప్రభాస్ మొదటి
బాలీవుడ్ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా రాముడి పాత్రలో కనిపించనున్న
ప్రభాస్ కు సైతం ఇది ఎంతో ఛాలెంజింగ్
సినిమా అని చెప్పాలి. ఈ పాత్ర కోసం
ప్రభాస్ తీవ్రంగా కష్టపడుతున్నారు. రెండేళ్ల క్రితమే ప్రత్యేకమైన సెట్లో ఈ
సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకుంది. ఆ సమయంలో రాముడి యొక్క లుక్ కోసం
ప్రభాస్ చాలా కష్టపడ్డారని చిత్ర బృందాలు చెప్పాయి. అలా
ప్రభాస్ పడిన కష్టమంతా తెరపై ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది అని అంటున్నారు.
రెబల్ స్టార్ తప్పకుండా అభిమానులను
ఫిదా చేస్తాడని అంటున్నారు.
బాహుబలి సినిమా తర్వాత అత్యంత భారీ స్థాయి లో రాబోతున్న ఈ
సినిమా యొక్క లుక్
శ్రీ రామ నవమి
పండుగ సందర్భంగా ఏప్రిల్ 10వ తేదీన రాబోతుంది. అలా ఈ సినిమాకు సంబంధించిన లుక్ ను భారీ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాతో పాటే
ప్రభాస్ మరి కొన్ని సినిమాలను కూడా సెట్స్ పైకి తీసుకువచ్చాడు. వీటిలో ముందుగా సలార్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చిన్న చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో కూడా ఆయన ఓ
సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే మొదలు పెట్టనున్నారు. అలాగే
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా ఆయన స్పిరిట్ అనే ఓ
సినిమా చేస్తున్నాడు.