తమిళ నటుడు విశాల్ కొంత కాలం క్రితం మార్క్ ఆంటోనీ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా ... అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎస్ జె సూర్యమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి విజయాన్ని అందుకుంది.   


ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించబోతుంది. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ వారు దక్కించుకున్నారు.

అందులో భాగంగా ఈ సినిమాను మే 12 వ తేదీన సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు ప్రకటించారు. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. మార్క్ ఆంటోనీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత విశాల్ , హరి దర్శకత్వంలో రూపొందిన రత్నం అనే సినిమాలో హీరో గా నటించాడు. కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఈ సినిమాలో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: