ఆంధ్రప్రదేశ్లో మరో ఐదు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు వారి వారి  ప్రచారంలో భాగంగా చివరిదశకు చేరుకున్నాయి. కూడా కూటమిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు 21 స్థానాలు కేటాయించారు.అయితే ఆ స్థానాలను గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు సినీ ప్రముఖుల మద్దతు బాగా లభిస్తుంది. గత ఎన్నికల్లో బహిరంగంగా పవన్ కళ్యాణ్ కు సినీ రంగం నుంచి మద్దతు కరువైంది. కానీ ప్రస్తుతపు ఎన్నికలలో సినీ తారలు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా నిలిచారు.గత ఐదేళ్లుగా జనసేన పార్టీని, తన కేడర్ ను పెంచుకునే ప్రయత్నం చేశాడు పవన్. ఈసారి కచ్చితంగా ఏపీ ఎన్నికలలో జనసేన ప్రభావం భారీగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు.పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురంలో ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈసారి ఎలాగైనా సరే గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేటటువంటి పవన్ కు మద్దతుగా ఎందరో సినీ, బుల్లితెర సెలబ్రిటీలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. హైపర్ ఆది, జానీ మాస్టర్, హీరోయిన్ నమిత, మెగా హీరోలు పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.

అయితే అదే బాటలో ప్రస్తుతం యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా ఆ లిస్టులో చేరారు. ఆయన కూడా పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయాలని నిశ్చయించుకున్నారు.అయితే ఇదే విషయాన్ని 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' టీజర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌లో నాగవంశీ మాట్లాడారు. అయితే దాంట్లో భాగంగా ఆంధ్ర నుంచి వచ్చి  హైదరాబాదులో సెటిల్ అయినటువంటి పవర్ స్టార్ అభిమానులంతా  ఎన్నికల ముందు రోజు పిఠాపురం వెళ్లి ప్రచారంలో పాల్గొని  మే 13న జరిగేటటువంటి పోలింగ్లో పాల్గొనాలనికోరారు.అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికలు ఆ రాష్ట్ర రూపు రేఖలు మార్చే విధంగా ఉండాలని దానికోసమే పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరారు.అయితే మనం వేసే  ఓటింగ్‌ శాతం గెలుపు, ఓటములపై తప్పకుండా ప్రభావం చూపుతుందని నాగవంశీ అన్నారు. ఇంకా మనకు తెలియకుండా బయటిరాకుండా ఆర్థికంగానూ తమ వెన్నుదన్నులు దర్శక నిర్మాతలు పవన్ కు అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: