సీనియర్ యాక్టర్ అర్జున్ తో వచ్చిన విభేదాల వల్ల విశ్వక్ సేన్ మీడియాలో సంచలనంగా మారాడు. అర్జున్ విశ్వక్ సేన్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ తరువాత అతడు తన కూతురు ఐశ్వర్యా అర్జున్ ను హీరోయిన్ గా మొదలుపెట్టిన మొదటి సినిమా ఆగిపోతుందని అందరు భావించారు.


అయితే అర్జున్ తన కూతురు కెరియర్ విషయంలో చాల స్పష్టంగా ఉండటంతో మొదలుపెట్టిన ఈమూవీని విశ్వక్ సేన్ తో కాకుంటే మరొక హీరోతో పూర్తి చేయాలి అన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో అర్జున్ దృష్టిలో ఈమూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి శర్వానంద్ ఆలోచనలోకి వచ్చాడు అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారంమేరకు ఈమధ్య అర్జున్ శర్వానంద్ ను కలిసి ఈమూవీ కథ చెప్పడమే కాకుండా విశ్వక్ సేన్ స్థానంలో హీరోగా నటించమని కోరినట్లు తెలుస్తోంది.


గత కొన్ని సంవత్సరాలుగా వరస ఫ్లాప్ లతో సతమతమైన శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ మూవీతో తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు. ఈమధ్య కొందరు దర్శక నిర్మాతలు శర్వానంద్ ను కలిసి కొన్ని కథలు వినిపించి అతడి డేట్స్ అడుగుతున్నట్లు టాక్. గతంలో కథల ఎంపిక విషయంలో తాను చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకూడదు అన్న ఉద్దేశ్యంతో ఉన్న శర్వానంద్ తాను ఒప్పుకునే ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇలాంటి పరిస్థితులలో విశ్వక్ సేన్ తో అభిప్రాయభేదాల వల్ల ఆగిన మూవీ ప్రాజెక్ట్ లో తాను మళ్ళీ హీరోగా ఎంట్రీ ఇస్తే ఎంతవరకు అది సక్సస్ అవుతుంది అన్న కన్ఫ్యూజన్ శర్వానంద్ కు ఉండటంతో అర్జున్ ఆఫర్ ను పెండింగ్ లో పెట్టి ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఈమధ్య మళ్ళీ వివాదాలలోకి వచ్చి సంచలనంగా మారిన విశ్వక్ సేన్ తానే నిర్మాతగా అదేవిధంగా దర్శకుడుగా మారి ‘దాస్ కి ధమ్ కి’ అనే వెరైటీ సినిమాకు శ్రీకారం చుడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: