ఈ మధ్య స్టార్ హీరోలు నటించడమే కాకుండా మిగతా విభాగాల్లో కూడా తమ సత్తాను చాటుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ హీరోలు అని చెప్పాలి. హీరోలు గానే కాకుండా నిర్మాతలుగా సింగల్ గా డైరెక్టర్లుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా తమ టాలెంట్ను బయటపడుతున్న తమిళ స్టార్ హీరో ధనుష్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సింగర్ గా కూడా తన టాలెంట్ ను ప్రదర్శిస్తున్నాడు. శింబు కూడా అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఫేమస్ అవుతున్న సంగతి తెలిసిందే.అయితే శింబు కన్నా ధనుష్ రెగ్యులర్గా ఎక్కువ పాటలను పాడుతూ ఉంటాడు.

 ఇక ప్రజల అనుష్క  కోసం ధనుష్ తన గాత్ర మాధుర్యాన్ని వినిపించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ధనుష్ ఒక స్పెషల్ సాంగ్ను పాడబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలో కూడా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాకు ధనుష్ రెండు భాషల్లో కూడా తానే పాటను పాడబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒకప్పుడు వై దిస్ కొలవరి అంటూ పాడిన పాట ప్రపంచాన్ని ఎంతలా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక ఈ పాటతో తనలో సింగింగ్ టాలెంట్ కూడా ఉంది అని నిరూపించాడు ధనుష్ .నవీన్ అనుష్క సినిమాకు ధనుష్ పాట పాడవతున్నారని తెలిసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ తీసుకున్న అనుష్క జాతి రత్నాలు సక్సెస్ తరువాత నవీన్ వీరిద్దరూ కలిసి ఈ సినిమా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా విడుదల ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ధనుష్ ఈ సినిమాలో పాట పాడుతున్నాడు కాబట్టి ఈ సినిమాకి మరింత క్రేజ్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలా ఉంటే ఒకసారి సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించిన ధనుష్ హీరో గానే కాకుండా సింగర్ గా కూడా ఈ సినిమాతో తన సత్తాను చాటుకు పోతున్నాడు.!!

మరింత సమాచారం తెలుసుకోండి: