మెగాస్టార్ చిరంజీవి  కొరటాల శివ మూవీకి ‘ఆచార్య’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు అనేక వార్తలు వచ్చినా ఈ టైటిల్ విషయమై కొంత సస్పెన్స్ కొనసాగించాలని కొరటాల మొదట్లో భావించాడు. అయితే ‘ఓ పిట్ట కథ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ అనుకోకుండా తన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ అంటూ బయటపెట్టాడు. 


దీనితో ఈ సినిమా టైటిల్ పై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర దించడం జరిగింది. దీనితో అందరికీ తెలిసిపోయిన ఈ మూవీ టైటిల్ కు క్రేజ్ తగ్గకుండా కొరటాల ఎలర్ట్ అయి ఈ మూవీ ఫస్ట్ లుక్ ను వచ్చే వారం రాబోతున్న హోలీ రోజున విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 


వాస్తవానికి ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ఈ నెలలో రాబోయే ఉగాది పండుగ రోజున విడుదల చేయాలని భావించాడు. అయితే అప్పటి వరకు వేచి ఉండటం మంచిది కాదు అన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలను ముందుకు జరిపినట్లు తెలుస్తోంది. ఈసారి కరోనా ఎఫెక్ట్ తో హోలీ పండుగ సరదాలు చాల తక్కువగా జరిగే పరిస్థితులలో మెగా అభిమానులకు మాత్రం ఈసారి హోలీ మంచి జోష్ ను ఇచ్చే ఆస్కారం కనిపిస్తోంది. 


ఇది ఇలా ఉంటే ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ రచన విషయంలో కొరటాల శివకు డైలాగ్ రైటర్ శ్రీధర్ సిపానని చిరంజీవి కొరటాలకు జత చేసినట్లు తెలుస్తోంది. కామెడీ సీన్స్ రాయడంలో కొరటాలకు పెద్దగా పేరు లేకపోవడంతో కామెడీ సీన్స్ క్రియేట్ చేయడంలో మంచి పేరుపొందిన శ్రీధర్ సిపానని కోర్తాలకు ఇష్టం లేకపోయినా అతడికి జత చేసినట్లు టాక్. ఇప్పటికీ ఈ సినిమాలో మహేష్ అతిథి పాత్రకు సంబంధించిన విషయం పై క్లారిటీ లేకపోవడంతో ఈ మూవీలో ఇంకా ఎటువంటి ట్విస్ట్ లు ఉంటాయి అన్నసందేహాలు అనేకం..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: