కొన్నిరోజుల క్రితం తన షష్టిపూర్తి సందర్భంగా అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన బాలకృష్ణ ఇండస్ట్రీ పాలిటిక్స్ పై అదేవిధంగా చిరంజీవి ప్రస్తుతం పోషిస్తున్న ఇండస్ట్రీ పెద్దన్న పాత్ర పై కొన్ని కామెంట్స్ పరోక్షంగా చేసి అనేకమంది ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఆతరువాత బాలయ్య ఈ విషయాల పై మౌనం వహించడంతో బాలయ్య రాజకీయాలు ఇక ఆగిపోయినట్లే అని అనుకున్నారు అంతా.


అయితే బాలయ్య తన రాజకీయాలను ఇప్పుడు వేరే విధంగా కొనసాగించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతనెల బాలకృష్ణ పుట్టినరోజునాడు విడుదలైన బోయపాటి బాలయ్యల లేటెస్ట్ మూవీ టీజర్ లో బాలయ్య చెప్పిమ పంచ్ డైలాగ్ కు అన్యూహ్య స్పందన రావడంతో జోష్ లోకి వెళ్ళిపోయిన ఈ నందమూరి సింహం తన స్పీడ్ ను మరింత పెంచి ఇప్పుడు ఏకంగా తన లేటెస్ట్ మూవీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కీలక నేతలను టార్గెట్ చేసే విధంగా తన లేటెస్ట్ మూవీలో మరిన్ని పంచ్ డైలాగ్స్ పెట్టమని బాలయ్య బోయపాటికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు అని వార్తలు వస్తున్నాయి.


ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయోమయంగా ఉండటంతో ఆ పార్టీ క్యాడర్ కు జోష్ ను కలిగించేలా తన పంచ్ డైలాగ్స్ వేడిని పెంచమని బాలయ్య బోయపాటికి స్పష్టంగా చెప్పినట్లు లీకులు వస్తున్నాయి. ఈ మూవీలో బాలకృష్ణ రెండు తరహా పాత్రలు పోషిస్తూ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే.


ఈ రెండు పాత్రలు ఒక పాత్ర పూర్తి రాజకీయ నేపధ్యంలో ఉంటుందని అందువల్లనే బాలకృష్ణ తన పాత్రలోని డైలాగ్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలను ఇరుకున పెడతాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుతతరం టాప్ హీరోలు తమ సినిమాలలో ఎటువంటి వివాదాలు లేకుండా చూసుకోమని దర్శకులకు సలహాలు ఇస్తుంటే బాలకృష్ణ మాత్రం బోయపాటికి తన లేటెస్ట్ మూవీలో కొద్ది మోతాదులో వివాదాలు కావాలి అని అడగడంతో ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉండే దర్శకుడుగా పేరుగాంచిన బోయపాటి బాలయ్య మాటలను కాదనలేక లోలోపల భయపడుతున్నట్లు టాక్..    

మరింత సమాచారం తెలుసుకోండి: