లాక్ డౌన్ టైమ్ లో మహేశ్ పిల్లలతో ఆడుకుంటున్నట్టు కనిపించాడే గానీ.. చాలా పెద్ద పనులే పూర్తి చేసేశాడు. నిర్మాతగా ముగ్గురు హీరోలతో మూడు సినిమాలు ప్లాన్ చేశాడు. ఈ ముగ్గురిలో ఇద్దరు యంగ్ హీరోలు కాగా.. ఓ తమిళ హీరో కూడా ఉన్నాడు. 

 

శ్రీమంతుడు సినిమాతో మహేశ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ పతాకం స్థాపించి మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి ఈ మూవీ నిర్మించాడు. ఆ తర్వాత భరత్ అనే నేను.. బ్రహ్మోత్సవం.. సరిలేరు నీకెవ్వరు సినిమాలకు కూడా మహేశ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పటి వరకు తను నటించే సినిమాలకే భాగస్వామిగా ఉన్న మహేశ్.. బయట హీరోలతో కూడా సినిమాలు నిర్మించడం స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం అడవి శేష్ హీరోగా మేజర్ మూవీ నిర్మిస్తున్నాడు మహేశ్. 

 

లాక్ డౌన్ టైమ్ లో మూడు సినిమాలు ప్లాన్ చేశాడు మహేశ్. విజయ్ దేవరకొండ.. శర్వానంద్.. తమిళ హీరో కార్తీ ఇందులో హీరోలుగా నటించనున్నారు. విజయ్ దేవరకొండ వెబ్ సైట్ పై ఫైర్ అయినప్పుడు మహేశ్ అండగా నిలుస్తూ సోషల్ మీడియాలో స్పందించాడు. చాలా కాలంగా ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. ఇప్పుడిది కలిసి సినిమా చేసేలా చేసింది. 

 

ఇక శర్వానంద్ కథ విని ఓకే అన్నట్టు సమాచారం. చెన్నయ్ లో చదువుతున్న రోజుల్లో కార్తీ, మహేశ్ మంచి స్నేహితులు. ఈ క్రమంలో తెలుగు, తమిళంలో కార్తీతో ఓ సిినిమా ప్లాన్ చేశాడు మహేశ్. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే ఊపిరి తర్వాత కార్తీ నటించే తెలుగు సినిమా ఇదే అవుతుంది. షూటింగ్స్ ఎప్పుడు ఎలా మొదలుపెట్టాలా.. ఆగస్ట్ కు అయినా థియేటర్స్ ఓపెన్ అవుతాయా.. అనే టెన్షన్ లో సినిమా ఇండస్ట్రీ ఉంటుంటే.. మహేశ్ మాత్రం నిర్మాతగా బిజీ కావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: