మొన్నరాత్రి ఆర్జీవి వరల్డ్ ధియేటర్ ద్వారా విడుదలైన ‘నగ్నం’ సినిమా చూసినవారు నిన్నటి రోజు అంతా మైండ్ బ్లాంక్ అయిపోయి మాట్లాడడానికి కూడ మాటలు రాని స్థాయికి వెళ్ళిపోయారు. దీనికి కారణం ‘నగ్నం’ సినిమాలో బూతులు తప్ప ఎక్కడా క్రియేటివిటీ కనిపించకపోవడం.


వివిధరకాల కెమెరా యాంగిల్స్ లో ఒక అమ్మాయిని ఎక్స్ పోజ్ చేయడానికి మాత్రమే ఈ సినిమా వర్మ తీయడంతో వర్మ దిగజారుడు తనానికి ఈ సినిమా పరాకాష్టగా మారింది. సినిమా మేకింగ్ పై అపారమైన అనుభం ఉన్న వర్మ డబ్బుకోసం ఇంత దిగాజారిపోవాలా అంటూ చాలామంది ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు.


పైరసీలో దొరికినా ఇలాంటి సినిమాని చూడవద్దని సలహాలు ఇస్తూ ఇలాంటి పచ్చి బూతు సినిమాలకు దూరంగా ఉంటే బ్యాండ్‌విడ్త్ ఇంటర్నెట్ డేటా సమయం ఇతర ఎనర్జీలతో పాటు 200 రూపాయలు ఆదా అవుతాయి అంటూ  ఓపెన్ గా కామెంట్స్ చేస్తున్నా ఈ సినిమా ద్వారా వర్మ కు కలెక్షన్స్ గట్టిగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి విమర్శలు వస్తున్నా వరసపెట్టి ఒటీటీ లో విడుదల చేయడానికి వరసపెట్టి సినిమాలు తీస్తున్న వర్మ దృష్టి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పడినట్లు అర్ధం అవుతోంది.

 

ఇప్పటికే సంచలనాలు సృష్టించిన అమృత మారుతీ రావ్ ల నిజజీవిత కథ పై సినిమా తీయబోతున్న వర్మ పవర్ స్టార్ పేరు మీదుగా ఒక గంట నిడివి ఉండేలా ఒక షార్ట్ ఫిలిం తీయబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈ టైటిల్ ను బట్టి వర్మమూవీ ద్వారా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయబోతున్నాడు అన్న అనుమానాలు రావడం సహజం. ఇప్పటికే వర్మ తీసిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ మూవీలో పవన్ కళ్యాణ్ పోలికలు ఉన్న పాత్రతో పవన్ పై సెటైర్లు వేసిన వర్మ ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ టైటిల్ తో షార్ట్ ఫిలిం తీస్తే ఆ సినిమాలో వాస్తవానికి ఏమీ ఉండకపోయినా పవన్ వీరాభిమానుల ఖంగారు నెగిటివ్ కామెంట్స్ వల్ల రానున్న రోజులలో ఈ పవర్ స్టార్ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదల కాకుండానే రచ్చరచ్చ చేసేలా ఉంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: