మహేశ్ బాబు సర్కారు వారి పాటలో హీరోయిన్ ఎవరు అనే విషయం ఇంకా తేలడం లేదు. ఇప్పటికే ఓ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తుండగా.. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ప్రముఖ విలన్ డాటర్ కావడం విశేషం. 

 

సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇంతకుముందు మహేశ్ తో భరత్ అనే నేను చిత్రంలో రొమాన్స్ చేసిన కియారా అద్వానీ... మరోసారి జోడీ కట్టనుందని వినిపించింది. 

 

అయితే కియారా వరుసగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండటం వలన.. సర్కారు వారి పాటలో నటించే అవకాశాలు తక్కువగా ఉన్నాయట. దాంతో సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ 3తో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్.. సాయి మంజ్రేకర్ పేరు లైన్ లోకి వచ్చింది. ఈ బ్యూటీ ఎవరో కాదు.. పలు తెలుగు సినిమాల్లో విలన్ గా నటించిన మహేశ్ మంజ్రేకర్ కూతురు. ఒకవేళ మహేశ్ సరసన సాయి మంజ్రేకర్ కు నిజంగానే ఛాన్స్ దక్కితే మాత్రం చాలా లక్కీ అనే చెప్పాలి. 

 

ఇక సర్కారు వారి పాట షూటింగ్ అక్టోబర్ నుండి మొదలవుతుందని ఫిల్మ్ నగర్ సమాచారం. అప్పటిలోగా హీరోయిన్ ను ఫైనల్ చేయాలని భావిస్తోందట చిత్ర యూనిట్. మరి మహేశ్ సరసన.. ఇంతకుముందు రొమాన్స్ చేసిన కియారా అద్వానీ నటిస్తుందా.. లేక అప్ కమింగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ కు ఆ ఛాన్స్ దొరుకుతుందా.. అనేది చూడాలి. మొత్తానికి సర్కారు వారి పాట మూవీపై అభిమానుల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది.  మహేశ్ సరసన నటించే హీరోయిన్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: