తెలుగు, తమిళ్, కన్నడ అనే తేడా లేకుండా ప్రభాస్ నుంచి ధనుష్ వరకు అంతా పాన్ ఇండియన్ మార్కెట్పై ఫోకస్ పెడుతున్నారు. సౌత్ స్టోరీస్తో ఇండియన్ బాక్సాఫీస్ని ఇంప్రెస్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ మూడు పాన్ ఇండియన్ మూవీస్ ప్రిపేర్ చేస్తోంటే, బాహుబలి రూట్లో మరికొంతమంది నార్త్కి వెళ్తున్నారు.
టాలీవుడ్ టాప్ స్టార్స్ జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు. తెలుగు నుంచి హిందీ బెల్ట్ వరకు స్టార్డమ్ని విస్తరించుకోవాలనుకుంటున్నారు. రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియన్ మూవీ 'ట్రిపుల్ ఆర్'తో నార్త్కి వెళ్తున్నారు తారక్, చరణ్. ఇప్పటికే రిలీజైన టీజర్స్తో బీటౌన్లో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
తెలుగుతోపాటు మళయాళంలోనూ క్రేజీ మార్కెట్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు నార్త్లోనూ హంగామా చెయ్యాలనుకుంటున్నాడు. అందుకే 'పుష్ప' సినిమాని పాన్ ఇండియన్ మూవీగా ప్లాన్ చేశాడు అల్లు అర్జున్. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు,తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది.
కెరీర్ బిగినింగ్లో సౌత్ స్టార్ అనిపించుకోవాలనుకున్న విజయ్ దేవరకొండ, ఇప్పుడు పాన్ ఇండియన్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో 'ఫైటర్' సినిమాతో నార్త్కి వెళ్తున్నాడు విజయ్. అయితే మల్టీలింగ్వల్గా రిలీజైన 'నోటా, డియర్ కామ్రేడ్' సినిమాలకి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. మరి ఈ 'ఫైటర్' విజయ్కి పాన్ ఇండియన్ ఇమేజ్ తీసుకొస్తాడా అనేది చూడాలి. మొత్తానికి మన హీరోలు ఉత్తరాది మార్కెట్ ను శాసిస్తున్నారు. అక్కడ అరుదైన అవకాశాలు అందుకుంటూ అక్కడి హీరోలకు పోటీగా మారారు.