ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...‘బాహుబలి’ సినిమా తెలుగులో ఫస్ట్ భారీ బడ్జెట్ చిత్రం మాత్రమే కాదు ప్రభాస్ కెరీర్ లో కూడా భారీ బడ్జెట్ చిత్రమే... ఈ సినిమా  వల్ల తెలుగు సినిమా స్థాయి పెరగడం పక్కనపెడితే… ప్రభాస్‌ సినిమాల బడ్జెట్‌ పెరిగిపోయింది. ‘సాహో’తో ఈ విషయం అందరికీ అర్థమైంది. ఇక రాబోయే సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలుగా తెరకెక్కబోతున్నాయి.. స్పాన్‌ పెంచి పాన్‌ ఇండియాగా మూవీగా తీర్చిదిద్దే క్రమంలో బడ్జెట్‌ను అమాంతం పెంచేశారు. ఇప్పుడు ‘రాధే శ్యామ్‌’ విషయంలోనూ అదే జరుగుతోందా? చిత్రబృందం నుంచి వస్తున్న లీకులు, టాలీవుడ్‌ వర్గాల లెక్కల ప్రకారం చూస్తే అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే సినిమా కోసం ఇప్పటికే యూవీ క్రియేషన్స్‌ ₹250 కోట్ల వరకు ఖర్చు పెట్టేసిందట. సినిమా ఇంకా పూర్తవ్వకపోవడంతో ఈ నెంబరు ఇంకా పెరిగేలా కనిపిస్తోంది.

‘రాధే శ్యామ్‌’ చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో వుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. దీని కోసం ప్రత్యేకంగా నాలుగు సెట్లు కూడా వేశారట. ఒక్కో సెట్‌కు భారీగా ఖర్చు అయినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా వాడని అత్యాధునిక కెమెరా, లెన్స్‌లను ఉపయోగిస్తున్నారట. సినిమా క్లైమాక్స్‌ విభిన్నంగా తెరకెక్కిస్తుండటమే దీనికి కారణం అని చెబుతున్నారు. ‘రాధే శ్యామ్‌’ పీరియాడికల్‌ వింటేజ్‌ సినిమాగా రూపొందుతున్న సినిమా కాబట్టి భారీ బడ్జెట్‌ పెట్టడం కరెక్టే అనిపిస్తోంది. అయితే అంత బడ్జెట్‌  అవసరమా అనిపిస్తుంది.

సరే బాహుబలి, సాహో సినిమాలు అంటే భారీ యాక్షన్ సీన్స్ తో కూడుకున్న సినిమాలు కాబట్టి భారీ బడ్జెట్ పెట్టడం సబబే కాని రాధేశ్యాం కి అంత పెట్టాలా అని అనిపిస్తుంది. అది కూడా సాహో దెబ్బ తిన్నాక... దీన్ని బట్టి ప్రభాస్ సాహోకి చేసిన తప్పు తెలుసుకోకుండా మళ్ళీ రాధే శ్యామ్ కి అంత బడ్జెట్ పెట్టడం ఎంత వరకు కరెక్టో మరి.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: