రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంస్థలపై ఎంతో భారీ గా ప్రతిష్టాత్మక రేంజ్ లో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కతున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక దీని తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, బాలీవుడ్ దర్శకడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, అలానే నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై మరొక సినిమా చేయనున్నారు ప్రభాస్.

ఇప్పటికే ఈ మూడు సినిమాలకు సంబంధించి పూర్తి గా తన కాల్షీట్స్ ని ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేశారట ప్రభాస్. అందుతున్న సమాచారాన్ని బట్టి నేడు సలార్ షూటింగ్ ప్రారంభం కానుండగా, మరికొద్దిరోజుల్లో నాగ అశ్విన్ మూవీ షూటింగ్ కూడా షురూ కానుంది. మరోవైపు ఆదిపురుష్ కి సంబంధించి కూడా కొంత వర్క్ జరుగుతోంది. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, ప్రభాస్ తో నాగ అశ్విన్ తీయనున్న భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాకి సంగీత దర్శకుడు గా యువ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ ని అలానే ఫోటోగ్రాఫర్ గా యూరోపియన్ ఫిలిం మేకర్ కమ్ ఫోటోగ్రాఫర్ అయిన డానీ శాంచెజ్ లోపెజ్ ని ఎంపిక చేసింది మూవీ యూనిట్.

ఈ సందర్భంగా వారిద్దరి పేర్లను తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అధికారికంగా అనౌన్స్ చేసింది మూవీ యూనిట్. ఇక తనకు వచ్చిన ఈ భారీ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుని మంచి అవుట్ ఫుట్ ఇస్తానని మిక్కీ అన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా దీపికా పడుకొనే నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: