ప్రతి ఏడాది సంక్రాంతి పండుగని ప్రజలందరూ కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అంతే కాదు సంక్రాంతి పండుగకు పసందైన విందుతో పాటు వాటిని మరిపించేలా కనులకు వీనులవిందు అందించేలా పలు సినిమాలు కూడా విడుదలవుతూ ఆడియన్స్ కి నాయనానందాన్ని ఇస్తుంటాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో రవితేజ క్రాక్ మూవీ అద్భుత విజయం అందుకుంది. గత ఏడాది సంక్రాంతికి మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు తలపడి రెండూ కూడా అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాయి.
ఇక రాబోయే 2022 సంక్రాంతికి అటు సూపర్ స్టార్ మహేష్, ఇటు పవర్ స్టార్ పవన్ ఇద్దరూ బాక్సాఫీస్ బరిలో దిగనున్నారు. దాదాపుగా ఎన్నో ఏళ్ల తరువాత ఈ ఇద్దరు బడా స్టార్స్ బాక్సాఫీస్ బరిలో తలపడుతుండడంతో ఇప్పటినుండే వారి వారి అభిమానుల హడావుడి సోషల్ మీడియాలో మొదలైపోయింది. ఇక పవన్, రానా తో కలిసి నటిస్తున్న అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ ని సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అధికారికంగా మేకింగ్ వీడియో విడుదల చేస్తూ తెలిపారు. భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో పవన్ నటిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు సమాచారం.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సాగర్ కె చంద్ర తీస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరోవైపు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటూ సంక్రాంతి విడుదలకు ముస్తాబవుతోంది. మొత్తంగా రాబోయే సంక్రాంతి పండుగ ఈ ఇద్దరు బడా స్టార్స్ సినిమాలతో కళకళలాడనుండగా వీరిలో ఎవరి సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి చూడాలి .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: