మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంచనాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఇటీవలే ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కపూర్ లాంటి అగ్ర తారలు రావడం జరిగింది.ఇక అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనుంది.

ఇదిలా ఉంటె శంకర్ సినిమాల్లో కొన్ని కొన్ని సన్నివేశాలు గూస్ బమ్స్ వచ్చేలా ఉంటాయి.ఇక ఇప్పుడు చరణ్ తో తెరకెక్కించే సినిమాలో కూడా అలాంటి కొన్ని సన్నివేశాలు కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఈ సినిమాలో ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందట.అది సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలవనుందట.సినిమాలో ఒక్క సీన్ కోసం నిర్మాత దిల్ రాజు ఏకంగా 10 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.ఇక గతంలో శంకర్ సినిమాల్లో పలు ట్రైన్ సీన్స్ ఉండగా..ఇక వాటికి మించి ఈ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందని.. అంతేకాకుండా ఈ సీన్లో రామ్ చరణ్ కొన్ని వందల మంది ఫైటర్స్ తో ఫైట్ చేస్తారని సమాచారం.

ఇక ఈ సన్నివేశాన్ని ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో చరణ్ కి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పలువురు వివిధ ఇండ్రస్టీ లకు చెందిన అగ్ర తారలు నటిస్తున్నారు.అంజలి, సునీల్, మలయాళ నటుడు జయరాం తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇక ఈ సినిమాని తక్కువ సమయంలో పూర్తి చేయాలని భావిస్తున్నారు మేకర్స్. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!


మరింత సమాచారం తెలుసుకోండి: