ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ, ఇద్దరు డేటింగ్ లో వున్నారని పలు వార్తలు వస్తున్నాయి.ఇక ఊహించని విధంగా నరేష్-పవిత్ర లోకేష్ వ్యవహారం వివాదాస్పదమైంది. తామిద్దరం ప్రాణ స్నేహితులమని ఇంకా తను నాకు ఆప్త స్నేహితురాలని నరేష్ అన్నారు. అయితే ఇద్దరూ కలిసి కూడా ఒకే రూమ్ లో ఉండడాన్ని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వ్యతిరేకించారు.ఇక ఈ మేరకు మైసూర్ లో నరేష్-పవిత్ర ఉంటున్న హోటల్ గది వద్ద ఆమె చాలా పెద్ద ఆందోళన కూడా చేశారు.ఇంకా అలాగే ఇప్పుడీ మొత్తం వ్యవహారంలోకి పవిత్ర భర్త కూడా ఎంటరయ్యాడు. ఇప్పటికీ పవిత్ర తన భార్యే అని అంటున్నాడు సుచీంద్ర ప్రసాద్. తన పాస్ పోర్టుపై భార్యగా పవిత్ర పేరు ఉందని ఇంకా అలాగే ఆమె పాస్ పోర్టుపై కూడా భర్తగా తన పేరు ఉందని చెబుతున్నాడు. తామిద్దరం సహజీవనం చేయలేదని భార్యాభర్తలుగా 16 ఏళ్లు పాటు కాపురం చేశామంటున్నాడు.


ఇక తామిద్దరం భార్యభర్తలమనే విషయం కర్నాటక మొత్తం  కూడా తెలుసని, ఇంకా అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటున్నాడు సుచీంద్ర. అన్నింటికీ మించి తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆయన బయటపెట్టాడు. పవిత్ర తనకు విడాకులు ఇవ్వలేదని ఇంకా అలాగే ఇప్పటికీ తామిద్దరం కూడా భార్యాభర్తలమేనని అన్నాడు.ఇక ఈ సందర్భంగా నరేష్ ఎవరో తనకు అసలు తెలియదంటున్నాడు సుచీంద్ర. తన భార్య సినిమా షూటింగ్స్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లి వస్తుందని, అంతవరకు మాత్రమే తనకు తెలుసని, నరేష్ తో ఆమెకు ఎఫైర్ ఉందా లేదా అనే విషయం తనకు అసలు తెలియదని అన్నాడు. ఇంకా అలాగే ప్రస్తుతం జరుగుతున్న వివాదం కూడా స్నేహితులు చెబితేనే తనకు తెలిసిందని అంటున్నాడు సుచీంద్ర.

మరింత సమాచారం తెలుసుకోండి: