టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి రావాలని అక్కడ సినిమాలు చేయాలని కొంతమంది బాలీవుడ్ హీరోయిన్ లు ఎప్పటినుంచో ఎన్నో కలలు కంటూ ఉంటున్నారు. అలా ఇప్పటికే బాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్లు వచ్చి తమ సత్తా చాటారు. తాజాగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా తెలుగులోకి రావాలనే ఆశపడుతుంది అని సోషల్ మీడియాలో వార్తలు బాగా వినిపించాయి. అయితే ఈ వార్తలు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న కూడా జాహ్నవి కపూర్ మాత్రం తెలుగు సినిమాలలో నటించడానికి ఇంకా సమయాన్ని తీసుకుంటూ ఉంటుంది.

ఇది ఆమె అభిమానులను ఎంతగానో నిరాశపరిచే విషయం అనే చెప్పాలి. వాస్తవానికి జాహ్నవి కపూర్ ఎప్పుడో తెలుగు సినిమా పరిశ్రమలోకి రావలసి ఉంది కానీ ఆమె కావాలనే ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తున్నట్లు ఇప్పుడు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దానికి కారణం ఆమె దగ్గరికి వస్తున్న సినిమాలలో ఆమె పాత్ర చాలా చిన్నదిగా ఉండడం అంతగా ప్రాముఖ్యత లేకపోవడం వంటిది జరగడంతోనే టాలీవుడ్ లో ఆమె సినిమాలు ఒప్పుకోక పోవడానికి ప్రముఖ కారణం అని చెబుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న జనగణమన సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించబోతుంది అని వార్తలు వినిపించాయి. 

కానీ ఆ అవకాశాన్ని కూడా ఆమె సున్నితంగా తిరస్కరించిందట. పూరీ జగన్నాథ్ ఇటీవలే ఆమెకు ఈ కథను నేరెట్ చేయగా సినిమా లోని యాక్షన్ పాత్ర చేయడానికి అంతగా సముఖంగా లేనని చెప్పిందట. దాంతో మరొకసారి ఆమె తెలుగు ఎంట్రీ వాయిదా పడింది ఆమె స్థానంలోనే పూజ హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేసింది చిత్ర బృందం మరి ఇతర హీరోల సరసన కూడా ఆమె ఏదో ఒక కారణం చెప్పి ఆ సినిమాను రిజెక్ట్ చేయడం వెనక కారణమేంటో తెలియాల్సి ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించబోయే సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: