ఈ సమస్య మొన్నటి వరకు సద్దుమణిగింది అని అనుకునే లోపే ఇప్పుడు మళ్ళీ వివాదాలకు తెరలేపి.. అభిమానుల ఆగ్రహానికి గురి అవుతున్నారు తెలుగు బడా నిర్మాత దిల్ రాజు. అసలు విషయం ఏమిటంటే తెలుగు స్టార్ హీరోలైన బాలకృష్ణ , చిరంజీవి.. వీరసింహారెడ్డి .. వాల్తేరు వీరయ్య సినిమాలను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఈ సినిమాలకు పోటీగా కోలీవుడ్ స్టార్ హీరోలు నటించిన అజిత్ తునివు.. విజయ్ వరిసు సినిమాలు కూడా సంక్రాంతి పండుగకు పోటీ పడుతున్నాయి.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ చేపడుతుండగా ప్రమోషన్స్ లో భాగంగా అజిత్ నటిస్తున్న తునివు డైరెక్టర్ హెచ్ వినోద్ మాట్లాడుతూ .. తునివు మరియు వరిసు రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద గెలవాలి అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కానీ దిల్ రాజు మాత్రం సంక్రాంతి విజేతగా వరిసు సినిమా నిలుస్తుందని.. విజయ్ మాత్రమే నంబర్ వన్ హీరో అని నిర్మాత దిల్ రాజు అన్నాడు. దీంతో అజిత్ అభిమానులు ఈయనపై పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి