రెండేళ్ల క్రితం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్లాక్ బ్యూటీ పూజా హెగ్డే ఇటీవల మళ్లీ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.తాజాగా తనకు రెండు సార్లు లైఫ్ ఇచ్చిన అల్లు అర్జున్ తో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అవుతుంది. బన్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్, పూజ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తో పాటు నందినీ రెడ్డి దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న సినిమాలో కూడా పూజకు ఛాన్స్ వచ్చినట్లు సమాచారం తెలుస్తుంది.ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నా.. ఇంకా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. అయితే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకున్న తర్వాత బాలీవుడ్ పై దృష్టి పెట్టింది పూజ.సౌత్‌ లో అవకాశాలు తగ్గడంతో నార్త్ పై ఫోకస్ పెట్టింది.


దక్షిణాదిలో అవకాశాల కోసం ట్రై చేస్తూనే.. ఉత్తరాదిలో అందిపుచ్చుకుంటోంది. బీ టౌన్ లో వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది.ఈమధ్యనే బాలీవుడ్ మూవీ దేవా సెట్స్ లోకి అడుగుపెట్టింది పూజ. రోషన్ ఆండ్రూస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజ ఇప్పటి దాకా ఎప్పుడు కనిపించని రోల్ లో సందడి చేయనుంది. ముంబైలో జరుగుతున్న షెడ్యూల్ లో ఈమధ్య ఈవిడ పాల్గొంది. ఓ యువ పోలీసు అధికారి కేసును దర్యాప్తు చేసే సమయంలో ఎదురైన సవాళ్ల చుట్టూ తిరిగే స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమాలో పూజ షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది.మరోవైపు, దేవాతో పాటు కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న కొత్త మూవీలో కూడా ఆమె ఛాన్స్ దక్కించుకుంది. అహాన్ శెట్టి హీరోగా నటిస్తున్న సంకీలోనూ హీరోయిన్‌ గా ఎంపికైంది. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే కానుకగా విడుదల కానుందీ చిత్రం. గతేడాది కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌ సినిమాతో హిందీ ఆడియన్స్ ను పలకరించింది. మరి పూజా హెగ్డే నటిస్తున్న కొత్త సినిమాలు ఆమెకు ఎలాంటి హిట్లు తెచ్చిపెడతాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: