సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా డీజె టిల్లు సినిమాతో ఈ యంగ్ హీరో ఫేమ్ సంపాదించుకున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న మూవీగా రిలీజయి భారీ విజయం సాధించింది.మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వర న్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.గతేడాది ఫిబ్రవరిలో 'డీజే టిల్లు'గా ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ సక్సెస్‌ను అందుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ . 'డీజే టిల్లు'కు సీక్వెల్‍గా ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' సినిమా తెరకెక్కుతోంది.తాజాగా ‘టిల్లు స్క్వేర్’ చిత్రం నుంచి మేకర్స్ మరో పాటను విడుదల చేశారు. ‘ఓ మై లిల్లీ’ అంటూ సాగే ఈ హార్ట్ బ్రేక్ సాంగ్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది.ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఈ నెల 29న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్స్, సాంగ్ విడుదల అయి సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు పెంచాయి. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.
మూవీ ప్రమోషన్స్లో భాగంగా నేడు మూవీ టీం నేడు రెండో సాంగ్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రచార పోస్టన్స్, టీజర్, సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రాధికా.. రాధికా సాంగ్ అయితే యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు బ్రేకప్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్.
రెండేళ్ల క్రితం యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన 'డీజే టిల్లు' ఎంతంటి విజయం సాధించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ సినిమా సంచలనం విజయం సాధించింది. రాధిక రాధిక అంటూ సిద్ధూ జొన్నలగడ్డ థియేటర్స్ లో చేసిన రచ్చని యూత్ తెగ ఎంజాయ్ చేసింది. ఇక సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మేకర్స్ ఈ సినిమాకు టిల్లు స్క్వేర్ పేరుతో సీక్వెల్ ని ప్రకటించింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు మార్చి 29న విడుదలకు సిద్దమైంది.అయితే, 'డీజే టిల్లు' సినిమాకు ఎస్ తమన్ నేపథ్య సంగీతం అందించారు. 'టిల్లు స్క్వేర్' సినిమాకు సైతం ఆయన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారని అంతా అనుకున్నారు. కానీ అందరి ఉహాగానాలు రివర్స్ చేస్తూ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ తెరపైకి వచ్చాడు. 'టిల్లు స్క్వేర్'కు భీమ్స్ సిసిరోలియో రీ రికార్డింగ్ చేస్తున్నారు. ఆ వర్క్ మీద ఆయన బిజీగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 'టిల్లు స్క్వేర్' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనులు భీమ్స్ ప్రారంభించారు. 'టిల్లు స్క్వేర్' సినిమాకు భీమ్స్ రీ రికార్డింగ్ చేస్తుంటే రామ్ మిరియాల, అచ్చు రాజమణి స్వరాలు అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన పాటలు 'రాధిక... రాధికా', 'టికెట్టే కొనకుండా' హిట్ అయ్యాయి. 'ఓ మై లిల్లీ' పాటను తాజాగా రిలీజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: