పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అద్భుతమైన స్థాయిలో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయంలోనే జనసేన అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత పవన్ తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నాను. సినిమాల్లో నటించే ఉద్దేశం లేదు అని ప్రకటించాడు. దానితో ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి చెందారు. ఇక కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఆ తర్వాత అభిమానుల కోరిక మేరకు అప్పుడప్పుడు సినిమాలు చేస్తాను అని ప్రకటించాడు.

అందులో భాగంగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన వకీల్ సాబ్ మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ లో శృతి హాసన్ , పవన్ కి జోడిగా నటించింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ బాలీవుడ్ సినిమా అయినటువంటి పింక్ కి అధికారిక రూపొందింది. భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాని తిరిగి మళ్ళీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మే 1 వ తేదీన వకీల్ సాబ్ మూవీ ని మళ్లీ భారీ ఎత్తున థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సినిమాలు రీ రిలీస్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: