బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అంటే తెలియని వారుండారు. ఆయన గురించి పరిచయం చేయడం కూడా అనవసరం. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తర్వాతే ఎవరైనా అనడంలో అతిశయుక్తి లేదు. అమీర్ ఖాన్ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ఆయన సినిమాలు అంటే బాలీవుడ్ తో పాటుగా.. టాలీవుడ్, కాలీవుడ్ ప్రేక్షకులు కూడా చూసేవాళ్లు. ఆయనకి, ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అమీర్ ఖాన్ చివరగా లాల్ సింగ్ చద్దా సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
 
హీరో అమీర్ ఖాన్ త్వరలో ఓ పాన్ ఇండియా సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా మహాభారతం నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలిపారు. ఈ సినిమాని అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజీ నిర్మాతలైన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాకు ఎంతో మంది చిత్ర నిర్మాతలు దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపిస్తుంది. అయితే పుష్ప ఫ్రాంచైజీ నిర్మాతలైన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్న మసాలా మూవీలో అమీర్ ఖాన్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఇక దీని గురించి ఇంకా చర్చించాల్సి ఉంటుందని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాని 2026లో ప్రారంభించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు ముందే అమీర్ ఖాన్, జెనీలియా దేశ్ ముఖ్ తో కలిసి సీతారే జమీన్ పర్ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ ఏడాది జూన్ నెలలో థియేటర్ లోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే తాను, సల్మాన్ ఖాన్ కలిసి రాజ్ కుమార్ సంతోషిణిని అందాజ్ అప్నా అప్నా సీక్వెల్ చేయమని కోరినట్లు అమీర్ ఖాన్ తెలిపారు.  




మరింత సమాచారం తెలుసుకోండి: