బాలీవుడ్ చత్రపతి సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు భారీ బడ్జెట్ చిత్రాల టైటిల్స్ తో పలు సినిమాలను అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమాలకు ఏవి కూడా విడుదల తేదీలు ప్రకటించలేదు. ముందుగా భైరవం సినిమా సంగతి విషయానికి వస్తే ఈ సినిమా డిసెంబర్ నుంచి వాయిదా వస్తూ ఉన్నది. ఇప్పుడైనా కొత్త డేట్ చెబుతారా లేదా అని అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మనోజ్ ఈ సినిమాని తన అన్నకి ఆపోజిట్ గా రిలీజ్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.


అయితే గత కొన్నేళ్లుగా  నిర్మాణంలో ఉన్న టైసన్ నాయుడు ఇంకా అడ్డంకులను దాటనే లేదు. టీజర్ వచ్చి ఇప్పటికీ ఏడాది అవుతూ ఉన్న ఎలాంటి అప్డేట్ కూడా కనిపించడం లేదు. అలాగే ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉన్న కిష్కింధపురి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే అంతకుముందు హైందవ అనే అనౌన్స్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఈ నాలుగు చిత్రాలలో రెండు ఫాంటసీ టచ్ ఉన్న పాన్ ఇండియా సినిమాలు.


ఒక సినిమా సెట్స్ మీద పెట్టడానికి మీడియం రేంజ్ హీరోలు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో సాయి శ్రీనివాస్ మాత్రం ఇంత స్పీడుగా ఉండడం చూసి అభిమానులు మెచ్చుకుంటున్నారు. అయితే రిలీజ్ డేట్ ప్లాన్ విషయంలో మాత్రం ఎక్కడో తేడా కొడుతున్నట్లుగా కనిపిస్తోంది.. ముందుగా భైరవం,టైసన్ నాయుడు వంటి సినిమాలు వ్యవహారం తేల్చాలి ఈ సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కచ్చితంగా ఆ తర్వాత రెండు సినిమాలు విజయాలను అందుకుంటాయి. రాక్షసుడు సినిమా తర్వాత అంతటి స్థాయిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్ అందుకోలేదు. ఇక సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ కూడా పలు చిత్రాలలో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: