
ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత - రాజ్ నిడమోరు బాగా దగ్గరగా ఉన్న పిక్స్ వైరల్ అవుతున్నాయి . కాగా అక్కినేని ఫ్యామిలీ - సమంతను దూరం చేసుకున్న.. సమంత పెట్టిన కండిషన్ని మాత్రం ఇంకా అలానే ఫాలో అవుతుందట. రీసెంట్గా ఇంట్లోకి కొత్త కోడలుగా అడుగుపెట్టిన శోభిత ధూళిపాళ్ళ కూడా ఆ రూల్ ని అలాగే ముందుకు తీసుకెళ్తుందట. సమంత అక్కినేని ఇంటికి కోడలుగా ఉన్నప్పుడు చాలా చాలా పద్ధతులు మార్చేసిందట. మరీ ముఖ్యంగా ఫుడ్ డైట్ విషయంలో అదేవిధంగా ఇంటికి సంబంధించిన కొన్ని కండిషన్స్ పెట్టిందట.
అందులో ప్రధానంగా అందరు ఫాలో అయ్యేది భోజనం చేసే సమయంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ టీవీ చూడకూడదు.. మొబైల్స్ వాడకూడదు ఎటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాడకుండా కేవలం తినేటప్పుడు ప్రశాంతంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ తినాలి అంటూ ఒక రూల్ తీసుకువచ్చిందట . అప్పట్లో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అయింది . చాలామంది సమంత పెట్టిన రూల్ ని తమ ఇళ్ళల్లో ఇంప్లిమెంట్ చేసుకున్నారు . అయితే ఇప్పుడు సమంతకు విడాకులు ఇచ్చేసాడు నాగ చైతన్య. ఆమె పెట్టిన రూల్స్ ఫాలో అవ్వాలన్న రూల్ లేదు . కానీ నాగచైతన్య - నాగార్జున మాత్రం ఇప్పటికి సమంత పెట్టిన రూల్ ని అలానే ఫాలో అవుతున్నారట . అడపాదడపా అమల-అఖిల్ ఈ రూల్ ని బ్రేక్ చేసిన నాగార్జున - నాగచైతన్య మాత్రం అలాగే కంటిన్యూ చేస్తున్నారట . హైలెట్ ఏంటంటే శోభిత కూడా ఆ రూల్ ని కంటిన్యూ చేస్తుందట . సోషల్ మీడియాలో ఇప్పుడు సమంత అక్కినేని ఫ్యామిలీకి పెట్టిన రూల్ తాలూకా డీటెయిల్స్ వైరల్ గా మారాయి..!