ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కువగా  తొక్కిసలాటలు జరుగుతున్నాయి.అప్పట్లో హథ్రాస్ లో భోలే బాబా సభ పెట్టిన సమయంలో 100 కి పైగా మంది మృతి చెందారు.అలాగే ఈ ఏడాది జరిగిన కుంభమేళలో కూడా తొక్కిసలాట జరిగి అప్పుడు చనిపోయారు. తిరుమలలో కూడా తొక్కిసలాట జరిగి కొంతమంది ప్రాణాలు విడిచారు.ఇక పుష్ప టు విడుదల సమయంలో తొక్కిసలాట జరిగి ఒక నిండు ప్రాణం బలిగొంది.మరో చిన్న ప్రాణం కొన ఊపిరితో కొట్టుకొని ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాడు. ఇక తాజాగా 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో కప్పు గెలిచిన ఆర్సిబి విజయోత్సవ ర్యాలీ కర్ణాటకలోని చిన్న స్వామి స్టేడియంలో చేసిన సెలబ్రేషన్స్లో పాల్గొన్న ఎంతోమంది అభిమానులు అత్యుత్సహాం ప్రదర్శించి ఒకేసారి పరుగున రావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దాంతో ఒకరి మీద ఒకరు పడి ఊపిరాడక తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది మృతి చెందారు.


ఇంకా చాలామంది తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.. అయితే ఈ విషయంపై ఆర్ సి బి స్పందించినప్పటికీ ఆ గొడవతో తమకేమీ సంబంధం లేదన్నట్లుగానే తన పోస్టులో పేర్కొంది. అంతమంది తొక్కిసలాటలో చనిపోవడం బాధాకరం అంటూనే మరోవైపు మేం అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పుకొస్తున్నారు.దీంతో చాలా మంది నెటిజెన్లు ఆర్సిబి పై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు అంతమంది ప్రాణాలతో చనిపోతే మీరు విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటున్నారా అంటూ మండిపడుతున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే ఆ రోజు పుష్ప టు సినిమా రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక ప్రాణం పోతే దానికి బాధ్యుడిగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు.

మరి ఇప్పుడు ఆర్సీబి కప్పు గెలిచిన సెలబ్రేషన్స్ లో పాల్గొన్న టైంలో దాదాపు 11 మంది చనిపోయారు. మరి ఈ 11 మంది చనిపోవడానికి ఎవరు బాధ్యత వహిస్తారు.. ప్రభుత్వమా లేక ఆర్సిబి టీం బాధ్యత వహిస్తుందా..అసలు కర్ణాటక ప్రభుత్వానికి చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం ఉందా అంటూ కొంతమంది నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా కర్ణాటక ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక మరొక నెటిజన్ అయితే తన ఎక్స్ ఖాతాలో ఏకంగా కోహ్లీని అరెస్టు చేయండి అంటూ పోస్ట్ పెట్టారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజెన్స్ పెట్టే ప్రశ్నల పోస్టులు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: