మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్‌ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు .. దశాబ్ద కాలంగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు .. ఇక ఇప్పుడు పాన్ ఇండియ‌ స్థాయిలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఆయన మొదటి ప్లేస్ లో ఉన్నారు .. త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు .. దీంతో ఇప్పుడు ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. ఇక ఇప్పుడు గ‌త‌ కొన్ని రోజులుగా వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు .. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు యంగ్ టైగర్ .. అలాగే మరో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా కూడా మొదలుపెట్టారు .. ఇలా ఇవే కాకుండా కొరటాల శివ దర్శకత్వంలో దేవర‌2 షైటింగ్‌ కూడా త్వరలోనే మొదలుపెట్టనున్నారు .  ఇప్పుడు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఆప్ కమింగ్ సినిమాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త‌ ఫీలింగ్ వర్గాల్లో తెగ వైరల్ గా మారింది .


ప్రజెంట్ ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో ఎన్టీఆర్సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .. ఇక ఈ మూవీలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్  హీరోయిన్గా నటిస్తున్నట్టు తెలుస్తుంది .  అయితే ఎన్టీఆర్ కు జంటగా నటించాలని చాలామంది హీరోయిన్స్ భావిస్తారు .  ఎన్టీఆర్ కు జంటగా నటించే అవకాశం వస్తే అసలు ఎవరూ వదులుకోరు ..అయితే త్రిబుల్ ఆర్ తర్వాత బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఎన్టీఆర్ కు జంటగా నటించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు .. అయితే ఇక్కడ ఎన్టీఆర్ కు జంటగా నటించే అవకాశం వస్తే ఓ హీరోయిన్ ఏకంగా మూడుసార్లు నో చెప్పిందట .. ఇంతకీ ఆమె మ‌రెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ .. ఈమెకు మూడుసార్లు ఎన్టీఆర్ కు జంటగా నటించే అవకాశం వస్తే .. పలు కారణాలతో ఆమె ఆ అవకాశాన్ని వదిలేసుకుందట .



అయితే వీరిద్దరు కలిసి త్రిబుల్ ఆర్ సినిమాలు నటించారు .. కానీ అందులో రామ్ చరణ్ కు ఆలియా జంటగా నటించింది .. అలాగే దేవర సినిమాలో కూడా ఎన్టీఆర్ కు జంటగా ఆలియా నటించాల్సి ఉంది .. కానీ ఆ స‌మ‌యంలో ఆమె ప్రెగ్నెంట్ గా ఉండటంతో అవకాశం కోల్పోయింది .. ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్ సినిమా కోసం సంప్రదించగా .. మరో సినిమాతో బిజీగా ఉండడంతో అది కుదరలేదు .. అలా పలు కారణాలతో ఎన్టీఆర్ కు జంటగా నటించే అవకాశం మూడుసార్లు వదులుకుంది .. దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది .





మరింత సమాచారం తెలుసుకోండి: