
టాక్ పాజిటివ్ గా ఉండటంతో కిష్కింధపురి డీసెంట్ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ రన్ ను ప్రారంభించింది. రెండో రోజు నుంచి కలెక్షన్స్ మరింత ఊపందుకున్నాయి. థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఓవైపు మిరాయ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా నుంచి
వస్తున్న పోటీని తట్టుకుని కిష్కింధపురి నిలబడిందంటే కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ సోలో రిలీజ్ దక్కుంటే ఈ చిత్రం బాక్సాఫీస్ను దున్నేసేది.
ఇదిలా ఉంటే..కిష్కింధపురికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట సర్క్యులేట్ అవుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ బెల్లంకొండ కాదట. డైరెక్టర్ కౌశిక్ మొదట ఈ చిత్రాన్ని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో చేయాలని భావించాడట. స్టోరీ నెరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో తేజ్ సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత నిఖిల్ ను సంప్రదించగా.. ఆయన స్టోరీకి బాగా ఇంప్రెస్ అయ్యారట. బట్ డేట్స్ సర్దుబాటు చేయలేక నిఖిల్ సైతం నో చెప్పాడు. ఫైనల్గా కిష్కింధపురి బెల్లంకొండ ఖాతాలో పడింది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు