టాలీవుడ్ లో ఈ మద్య తనదైన కామెడీతో అభిమానుల మనసు దోచేస్తున్న కమెడియన్ ప్రియదర్శి. ‘పెళ్లిచూపులు’సినిమాతో తనదైన శైలిలో హాస్యాన్ని పంచాడు ప్రియదర్శి.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియదర్శి పలువురు హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ‘స్పైడర్’ సినిమా షూటింగ్ లో మహేష్ బాబు ని చూసినపుడు తెగ సంబరపడిపోతుండేవాడిని..లోకేషన్ కి వచ్చిన తర్వాత మహేష్ బాబు నన్ను గుర్తుపట్టి హాయ్ అని చెపితే  అది చాలు ఈ జీవితానికి అనిపించింది.   అయితే తమిళంలో నాకో డైలాగ్ చెప్పారు..కానీ నేను అది సరిగా పలకలేక పోయాను..దాంతో అక్కడున్నవాళ్లు పగలబడి నవ్వారు. 
Image result for mahesh babu priya darshi
 అప్పటి నుంచి మహేష్ బాబు సైతం అప్పుడప్పుడు ఆ డైలాగ్ కొడుతూ నన్ను ఆటపట్టించేవారు. అంతే కాదు నేను పెళ్లిచూపులు నటించిన నటన చాలా బాగుందని నేను చెప్పిన డైలాగ్ గుర్తు చేసి నవ్వించేవారు.  బయటికి మహేష్ బాబు అలా కనిపిస్తారు..కానీ ఆయనలో చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉందని అన్నారు ప్రియదర్శి. 

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.."జై లవ కుశ'లో ఎన్టీఆర్ మూడు పాత్రలను చేశారు .. ఒక పాత్రకి మరో పాత్రకి మధ్య ఎక్కడా పోలిక ఉండదు.
ఆయనకు ఎంత లెన్తీ డైలాగ్స్ ఇచ్చినా సునాయాసంగా చెప్పేస్తారని..డ్యాన్స్ కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడని..ఒక్కసారి చూస్తే ఈజీగా చేస్తారని ఇంతటి జ్ఞాపక శక్తి కలిగిన ఆర్టిస్టులు కూడా వుంటారా? అని నేను ఆశ్చర్యపోయాను. సీన్ చేస్తున్నప్పుడు ఆయన ఎంజాయ్ చేస్తారు .. అవతల ఆర్టిస్టును ఎంకరేజ్ చేస్తారు" అని చెప్పుకొచ్చాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: